ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పనమ్ కోషియమ్’ అనే మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారని వార్తలు వచ్చాయి కానీ ఎవరు ఏ పాత్ర చేస్తున్నారన్నదానిపై ఎటువంటి స్పష్టత లేదు. అయితే తాజాగా దీని గురించి అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలోని పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ మరియు మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. ఆయన వరుసగా సినిమాలకు ఓకే చెప్పేస్తున్నారు. వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ఇంకొన్ని రోజుల్లో మొత్తం ముగియనున్నదని ఆ సినిమా సిబ్బంది చెబుతున్నారు.
ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మలయాళ బ్లాక్ బస్టర్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ లో నటించనున్నారు. ఈ చిత్రానికి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం సుమారు 40 రోజులు షెడ్యూల్ చేసుకున్నారట.
మలయాళం ‘అయ్యప్పనమ్ కోషియమ్’ లో సూపర్ స్టార్ పృధ్వీరాజు సుకుమారన్ నటించిన పాత్ర కోసం రానా నిసంప్రదించగా రానా కి కూడా ఆ పాత్ర నచ్చడంతో ఆ పాత్రలో నటించడానికి రానా వెంటనే ఓకే చెప్పినట్లు చిత్రబృందం చెబుతున్నారు. రానా సరసన హీరోయిన్ నివేత పేతురేజ్ మరియు పవన్ కళ్యాణ్ సరసన సాయి పల్లవి నటించనున్నట్లు సమాచారం.
ఈ రోజు ఉదయం ఈ సినిమాను ప్రారంభించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కెమెరా ని ఆన్ చెయ్యగా పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరు పొందిన సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. ఈ చిత్రానికి SS థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండబోతున్నారట..