కలకత్తా బ్యాక్ డ్రాప్ లో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమా శ్యామ్ సింగ రాయ్. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించనున్న ఈ సినిమాకి ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలని ఘనంగా నిర్వహించిన చిత్ర యూనిట్ తాజాగా రెగులర్ షూటింగ్ ని మొదలు పెట్టారు. కాగా ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలో కలకత్తా బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండగా మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నాడు.
ఈ సినిమాని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తుండగా నాని కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా హయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. టాక్సీవాలా సినిమాతో అన్నీ వర్గాల ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్న రాహుల్ సంకృత్యన్ నాని కోసం కొత్త తరహా కథ ని రాశాడని చెప్పుకుంటున్నాడు. అంతేకాదు ఇప్పటి వరకు నాని కెరీర్ లో ఇలాంటి సినిమా చేయలేదని ఇదొక ప్రయేగాత్మక చిత్రం అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటిస్తున్న ‘టక్ జగదీష్’ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఈ నెలలో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుందని సమాచారం.
ఇక ఈ సినిమా తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే.. సుందరానికీ!’ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో నజ్రియ ఫహద్ హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమవుతోంది. వరసగా ప్రాజెక్ట్స్ తో సెట్స్ మీదకి వస్తున్న నాని 2021 లో ఈ మూడు సినిమాలని రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకున్నాడట. ఆ మధ్య వచ్చిన ” వి ” విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక నాని మారుతి దర్శకత్వంలో భలే భలే మగాడివోయ్ సీక్వెల్ కి ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా యువి క్రియేషన్స్ లో నిర్మిస్తారని సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!