పాకిస్థాన్ కు భారత్ మీద ఉన్న వైరం గురించి మనకి విదితమే. మన దేశ సరిహద్దుల వద్ద ఎంత ఉద్రిక్తత పరిస్థితులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన మీద ఎప్పుడు పాకిస్థాన్ దాడి చేస్తుందో అని భయంతో ఉంటాం.
ఇంక సరిహద్దులకు సమీపంలో ఉండే గ్రామాలలోని ప్రజలు గురించి అయితే చెప్పనక్కర్లేదు. వాళ్ళు ఎప్పుడు బిక్కుబిక్కుమంటూ ఉంటారు. కొంతమంది అయితే పాకిస్థాన్ దాడుల విషయాలు గుర్తొస్తేనే సరిగా నిద్రపోరు. సరిహద్దులోని ప్రజలు రోజూ అంత భయంతో బ్రతుకుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి తూటాలు దూసుకువస్తాయో తెలియదు, పరిస్థితి ఉద్రిక్తత అయితే ఎంత మంది చనిపోతారో తెలియదు. కంటి నిండా నిద్ర ఉండదు.
తాజాగా పాకిస్థాన్ కు చెందిన ఇద్దరు బాలికలు భారత సరిహద్దుల్లోకి ప్రవేశించడంతో ఇండియన్ ఆర్మీ అలెర్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ విషయం అధికారులలో తీవ్ర కలకలం రేపింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లోని పూంచ్ కు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు దారితప్పి నియంత్రణ రేఖను దాటి పొరబాటున భారత్ లోకి వచ్చారు. ఆ ఇద్దరు అమ్మాయిలు ఎల్ఓసీ వెంబడి సంచరిస్తూ ఉన్నారు. వారిని గమనించిన భారత భద్రతా బలగాలు వెంటనే స్పందించి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో వారు అనుకోకుండా సరిహద్దులు దాటి ఇవతలికి వచ్చారని, వారి వల్ల భారత్ కు ఎటువంటి ముప్పు లేదని పూర్తిగా నిర్ధారించుకున్నాకే మన భారత సైన్యం వారిని తిరిగి తమ స్వస్థలాలకు పంపించింది. ఈ సంఘటనను భారత్ రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. ఒకవేళ ఇదే విధముగా మన భారత్ అమ్మాయిలు ఆలా పాకిస్థాన్ సరిహద్దుల్లోకి వెళ్లి ఉంటే వారి పరిస్థితి ఎలా ఉండేదో అసలు మనం ఊహించగలమా?