Madanapalle case: మదనపల్లె జంట హత్యా కేసులో Madanapalle case నిందితురాలైన తల్లి Padmaja ప్రస్తుతం మదనపల్లె సబ్ జైలు లో ఉన్నారు. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేనందున తన వింత ప్రవర్తనతో అక్కడి ఖైదీలకు రాత్రిళ్ళు చుక్కలు చూపిస్తున్నట్లు సమాచారం. ఆమె రాత్రిళ్ళు బిగ్గరగా అరవడంతో జైలులో ఉన్న మిగతా ఖైదీలు బెంబేలెత్తిపోతున్నారని సమాచారం.
పద్మజ జైలులో అర్ధరాత్రి తాను శివుడినంటూ గట్టిగా కేకలేస్తూ అటూ ఇటూ తిరుగుతూ సడన్ గా కిందపడిపోతోంది. ఇది చుసిన మిగతా ఖైదీలు తమ కుటుంబ సభ్యులతో గత మూడు రోజులుగా తమకు నిద్రలేనట్లు చెప్పారట. జైలులోని మిగతా ఖైదీలు పద్మజను దూరంగా వేరే గదికి పంపించమని ప్రాధేయపడుతున్నారట. ఇక పద్మజ భర్త పురుషోత్తం నాయుడు పరిస్థితి కూడా ఇలానే ఉంది. జైలు గదిలో తనలో తాను కుమిలిపోతూ, గట్టిగా ఏడుస్తున్నాడని జైలు సిబ్బంది చెబుతున్నారు.
గత 9 నెలలుగా కరోనా నేపథ్యంలో ఖైదీలకు ములాఖత్ను నిలిపివేసిన జైలు అధికారులు ఇటీవల ఖైదీలు తమ తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అనుమతిని ఇచ్చారు. ఈ తరుణంలో వారు తమ కుటుంబ సభ్యులకు పద్మజ వల్ల తాము పడుతున్న బాధ గురించి వివరించినట్లు సమాచారం.
మరోపక్క ఈ జంట హత్యల కేసులో నిందితులలో ఒకరైన తల్లి పద్మజ మానసిక స్థితి సరిగా లేనందున వైద్య నిపుణులు ఆమెను చికిత్స కోసం విశాఖ ఆసుపత్రికి తరలించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆమెను చికిత్స కోసం విశాఖ లోని హాస్పిటల్ కు తరలిస్తే కేసు దర్యాప్తు కు ఆటంకం కలుగుతుందన్న ఉద్దేశంతో పోలీసులు ఉన్నట్లు సమాచారం. ఇటీవల స్థానిక న్యాయవాది ఒకరు నిందితులకు మెరుగైన చికిత్స అందించాలంటూ జేఎఫ్సీఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.