దేవుడు ఎవరికైనా దేవుడే. దేవుడిని కూడా మతాల్లోకి లాగి.. ఆ దేవుడు ఆ మతానికి చెందిన వాడు.. ఈ దేవుడు ఈ మతానికి చెందిన వాడు అని మనిషి మాత్రమే గిరిగీసుకొని బతుకుతున్నాడు. అది ఏమతమయినా ఆ మతం సంప్రదాయాలను, వాళ్ల దేవుళ్లను గౌరవించకున్నా ఏంలేదు కానీ.. కించపరచకూడదు.
ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే… ఓ ముస్లిం మహిళ ఓ షాప్ లో ఉన్న వినాయకుడి విగ్రహాలను కింద పడేసి మరీ పగులగొట్టేసింది. ఒకటి కాదు రెండు కాదు.. పదుల సంఖ్యలో ఉన్న వినాయకుడి విగ్రహాలను కింద పడేసి పగులగొట్టింది.
త్వరలో వినాయక చవితి వస్తున్నదని అందరికీ తెలిసిందే. వినాయక చవితిని ఒక్క భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న హిందువులు ఎంతో సంబురంగా జరుపుకుంటారు. బహ్రెయిన్ దేశంలో కూడా అలాగే వినాయక చవితి కోసమని తీసుకొచ్చిన వినాయక విగ్రహాలను బుర్ఖా ధరించిన మహిళ విచక్షణారహితంగా కిందపడేసింది.
దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు ముస్లింలు ఆమెకు మద్దతు పలికారు. ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం అంటూ కొందరు ముస్లింలు కామెంట్ చేశారు.
అయితే ఈ వీడియోపై బహ్రెయిన్ ప్రభుత్వం స్పందించింది. కావాలని 54 ఏళ్ల మహిళ హిందూ విగ్రహాలను ధ్వంసం చేసిందని.. దీనిపై సమాధానం చెప్పాలంటూ ఆమెకు లీగల్ నోటీసులు పంపించినట్లు ఇంటీరియర్ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
Ma sha Allah alhumma Mubarak
— یوسف (@yusufk611) August 16, 2020
Smashing idols is only done when a prophet is commanded by Allah(swt). We aren’t told to attack other people’s faith in this manner
— Aslichutyapa (@aslichutyapa) August 16, 2020