ఆడి కార్లకున్న క్రేజే వేరు.. లగ్జరీ కార్లలో ప్రయాణించాలి అనుకునే వారి మొదటి ఆప్షన్ ఆడీనే.. ఇటీవలే తన నాలుగో తరం ఆడీ ఏ3 మోడల్ ను ఆవిష్కరించి మంచి అమ్మకాలను సాధించింది. ఇప్పుడు తన సరికొత్త ఐదవ తరం ఆడి ఏ4 సెడాన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.. పూర్తి వివరాలు ఇలా..
ఫీచర్స్ :
ఇందులో 2.0 లీటర్ టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షనల్ లో లభిస్తుంది. ఇది 48 మైల్డ్ హైబ్రిడ్ సిస్టంతో పాటు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సు ను జతచేశారు. ఇంకా మ్యాట్రిక్స్ హెడ్ లంప్స్ ను అదనంగా అందిస్తుంది. ఈ సెడాన్ ఆల్-డిజిటల్ వర్చువల్ కాక్ పిట్ ను కలిగి ఉంటుంది. ఇందులో 10.1 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఇతర అప్గ్రేడేలు ఉన్నాయి. ఇవి క్యాబిన్ ను మరింత ప్రీమియం చేస్తాయి. ఫ్రంట్ & రిర్ బంపర్స్, 18- ఇంచ్ ప్రీమియం అల్లాయ్ వీల్స్ , ఎల్ఈడి టైయిల్ లైట్స్, డ్యూయల్ ఎగ్జాస్ట్ ఉన్నాయి. కాస్మెటిక్ అప్గ్రేడెడ్ కనెక్టింగ్ టెక్నాలజీ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఉన్న ఆడి ఇండియా ప్లాంట్ లో ఇప్పటికే కొత్త ఉత్పత్తి ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ మోడల్ను స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న తక్కువ ధరకే లభించనున్నది. ఏ సిరీస్ లో అత్యధికంగా అమ్ముడయ్యే వాటిలో ఏ4 ఒకటి. ఇది బిఎమ్ డబ్ల్యూ 3 సిరీస్, జాగ్వర్ ఎక్సే ఈ, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా నిలవనుంది.