BREAKING: ప్రస్తుత రోజుల్లో పెళ్లి అనేది గతంలో మాదిరిగా కాకుండా క్షణాల్లో జరిగిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో అరగంటలో పెళ్లి అనగా.. పెళ్లి కూతురు.. మండపం నుండి వెళ్లిపోయిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లాకు చెందిన రామాంజనేయులకు చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువతి తో పెళ్లి నిశ్చయమయింది.
ఈరోజు మదనపల్లిలో పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉండగా… మరోపక్క పెళ్లికూతురు బంధువులు కూడా మండపానికి చేరుకున్న తరుణంలో.. ఉన్నట్లుండి పెళ్లికూతురు.. మండపంలో కనపడక పోవటంతో.. పెళ్లి ఆగిపోయింది. దీంతో పెళ్ళికొడుకు ఎంతో బాధపడి నిశ్చితార్థం నుండి ఇప్పటివరకు 2 లక్షల ఖర్చు అయినట్లు.. బోరు బోరు మంటు ఏడ్చాడు. మరోపక్క పెళ్లికూతురు బంధువులు యువతి ఎక్కడికి వెళ్ళిందో అన్న దానిపై వెతుకులాట స్టార్ట్ చేశారు. ఏదిఏమైనా మరి కొద్ది గంటల్లో పెళ్లి అనగా మండపంలో పెళ్లి కూతురు లేకపోవడంతో.. పెళ్లికి వచ్చిన బంధువులు ఇంకా కొంతమంది ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.