ఇప్పుడు భారతదేశంలోని అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఒక వీడియో బాగా వైరల్ అయిపోయింది. ప్లాస్టిక్ గుడ్లు లేదా ఫేక్ గుడ్లను చైనాలో తయారుచేసి భారత మార్కెట్లో అమ్ముతున్నారు అన్న ఈ వీడియో ఇప్పుడు సంచలనం రేపుతోంది. దీంతో అందరూ చైనా వారిని విపరీతంగా తిట్టడం మొదలు పెట్టారు. ఇప్పటికే ఒక వైరస్ ను మాకు అంటగట్టారు…. అది చాలదన్నట్లు ఇలా ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారా అని వారి దేశం పై ధ్వజమెత్తారు..
ఇక దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) వారు సిద్ధమయ్యారు. ఇక వీరు చెప్పింది ఏమిటంటే ఇప్పుడు వైరల్ అవుతున్న ప్లాస్టిక్ గుడ్ల వీడియో పూర్తిగా ఫేక్ అని…. అసలు అటువంటిది భారతదేశంలో జరిగే అవకాశమే లేదని అన్నారు. అలాంటి గుడ్లు ఎక్కడ అమ్మబడడం లేదని చెప్పారు. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే అసలు ఒక గుడ్డుని పూర్తిగా కెమికల్స్ తో తయారు చేసేందుకు మామూలు కోడిగుడ్ల రూపం కల్పించేందుకు అవసరమైన టెక్నాలజీ ఇప్పటివరకు రాలేదట.
కాబట్టి ఇలా ప్లాస్టిక్ గుడ్లు ఉన్నాయని నమ్మి మోసపోవద్దని.. ప్రజలంతా సురక్షితంగా ఉన్నారని భరోసా ఇచ్చేశారు. స్వచ్ఛమైన కోడిగుడ్లు అంత భారీ సంఖ్యలో మనకు అందుబాటులో ఉంటే ఇటువంటి గుడ్లు చైనా నుంచి తీసుకుని రావాల్సిన అవసరం భారత్ కు లేదని చెప్పారు. ఇక గుడ్డులో ఉండే లోపలి పొర, బయట పొరను విడదీసి వాటిని యథాస్థానంలో పెట్టడం అనేది అసాధ్యం అని చెప్పేశారు. కేవలం ఒక కోడి నుండి మాత్రమే గుడ్డు వస్తుందని వీటిని కృత్రిమంగా తయారు చేయడం అసాధ్యమని అన్నారు.