ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన ధనిక దేశాలపై అసహనం వ్యక్తం చేసింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్నా పద్ధతులపై ధనిక దేశాలు అవలంభిస్తున్న వైఖరిపై WHO మండిపడింది. అంతేకాకుండా పంపిణీ చేస్తున్న కంపెనీల తీరుపై కూడా అసహనం వ్యక్తం చేస్తోంది. ధనిక దేశాలకు 39 మిలియన్ల డోసులు అందితే అదే ఓ పేద దేశానికి 25 డోసులే అందించటం సరైన విధానం కాదని డబ్యుహెచ్ ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రీసియస్ ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా వ్యాక్సిన్ తమకే కావాలని స్వార్థబుద్ధితో ధనిక దేశాలు ఆలోచిస్తున్న విధానం మంచిది కాదని చెప్పుకొచ్చారు. ఎవరి ప్రాణమైన ఒకటే అని ప్రపంచ దేశాలు ఆలోచించాలని చెప్పుకొచ్చారు. భూమి మీద ఉన్న మనిషి జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టిన ఈ వైరస్ ని తుదముట్టించడానికి వచ్చిన వ్యాక్సిన్ ల విషయంలో కంపెనీలు అందరికీ సమాన ప్రాతిపదికన అందించాలని డబ్యుహెచ్ ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రీసియస్ సూచించారు.
కాగా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన సమయములో ధనిక దేశాలు ప్రస్తుతం మానవత్వం లేకుండా ఆలోచన చేస్తున్నాయని.. కాబట్టి వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తూ అందించాలని టెడ్రోస్ అధనోమ్ పేర్కొన్నారు.