Ys Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలలో వచ్చిన ఫలితాలు వైయస్ జగన్మోహన్ రెడ్డి Ys Jagan Mohan Reddy పార్టీకి తిరుగులేదు అన్నరీతిలో.. వైసీపీ మద్దతు దారులు గెలవడం జరిగింది. ఇదే విషయాన్ని జాతీయ మీడియా చానల్స్ కూడా 2019 ఎన్నికలలో ఉన్న సపోర్ట్ ఇంకా ఏపీలో జగన్ కి కంటిన్యూ అవుతున్నట్లు తాజా ఏపీ పంచాయతీ మొదటి దశ రెండవ దశ ఫలితాలు బట్టి కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే గ్రామీణ ఓటర్లు ఎక్కువగా జగన్ పార్టీకి పట్టం కట్టడం కి కారణం అమలవుతున్న సంక్షేమ పథకాలు అని ఆ పార్టీకి చెందిన నాయకులు చెప్పుకొస్తున్నారు. ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని వచ్చిన ఏడాదిలోనే అమలు చేస్తూ మరో పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి కష్టపడుతూ జగన్ నాయకత్వంలో ఏపీ దూసుకుపోతుంది అంటూ పేర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే ఏయే పంచాయతీ లలో… వైసిపి పార్టీ కొద్ది గంటల్లో అయిందో పంచాయతీలకు సంబంధించి ఎమ్మెల్యేల విషయంలో… జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళితే సంబంధిత నియోజకవర్గంలో నేరుగా ప్రజలతో… ఎక్కడైతే తక్కువ పంచాయతీ వైసీపీ ఖాతాలో పడ్డాయో అక్కడ… మాట్లాడే కార్యక్రమం జగన్ ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నట్లు దీంతో ఈ వార్త తెలుసుకుని ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నట్లు వినికిడి. పంచాయతీ ఎన్నికల ఫలితాలు నివేదిక వచ్చిన వెంటనే… జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం కి శ్రీకారం చుట్టు బోతున్నట్లు, అవసరమైతే ఎమ్మెల్యేలపై చర్య కూడా తీసుకునే రీతిలో జగన్ ఆలోచన చేస్తున్నట్లు టాక్. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ ఎమ్మెల్యేలు అలర్ట్ అయినట్లు, కీలక స్థానాలు గెలవటానికి ఇప్పటి నుండే రంగంలోకి దిగినట్లు పార్టీలో టాక్.