వైకాపా నాయకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న “అమరావతి భూ కుంభకోణం” సినిమాను సంబంధించిన ట్రైలర్ ను ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసింది! అవును… ఇది బాబు గత ప్రభుత్వ హయాంలో ఏపీ వాసులకు చూపించిన భారీ బడ్జెట్, ఫుల్ ఆఫ్ సీజీ వర్క్స్ మూవీ! పబ్లిసిటీ పార్ట్ నర్స్ తమ్ముళ్లు… మీడియా పార్టనర్స్ ఆ రెండూ పత్రికలు – మరో ఆఫ్ ఛానల్! ఈ సినిమా ఇంతకాలం బాబు చూపిస్తే… ఆ సినిమా మేకింగ్ స్టిల్స్ ని, అందులో జరిగిన తెర వెనుక యవ్వారలను సినిమాగా తీయబోతున్న జగన్… దానికి సంబందించిన ట్రైలర్ ను ఏమాత్రం హడావిడి లేకుండా రిలీజ్ చేశారు! కానీ… ఆన్ లైన్ లో ఆ ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది!!
అవును… అమరావతి భూ కుంభకోణంపై “నిరూపించండి.. నిరూపించండి.. అలాంటివేమీ జరగలేదు.. రైతులు త్యాగాలు చేశారు.. టీడీపీ నేతలు పిల్లిమొగ్గలేశారు” అంటూ కబుర్లు చెప్పిన టీడీపీ నేతలకు టెన్షన్స్ పుట్టించేలా… తుళ్లూరు రిటైర్డ్ తహసిల్ధార్ నుంచి మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం. తాజాగా భూ రికార్డులను తారుమారు చేశారనే అభియోగంతో తుళ్లూరు రిటైర్డ్ తహసిల్దార్ సుధీర్ బాబు, నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములను కొనుగోలు చేశారని విజయవాడకు చెందిన గుమ్మడి సురేశ్ ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఇక్కడ చెప్పుకున్న సుధీర్ బాబుకి… నాటి ముఖ్యమంత్రితో సన్నిహిత సంబంధాలున్నాయనేది అప్పట్లో స్థానికంగా బహిరంగ రహస్యమే!
దీంతో… టీడీపీ నేతలకు టెన్షన్స్ పట్టుకున్నాయి. టీడీపీ నాయకులతో కలిసి భూ రికార్డులు తారుమారు చేసినట్లుగా సుధీర్ బాబుపై ఆరోపణలు ఉండటంతో… తమ్ముళ్లు తలలుపట్టుకున్నారంట. వీరిని అరెస్టు చేసిన అనంతరం వీరిద్దరిని మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నెల 29 వరకు కోర్టు వీరికి రిమాండ్ విధించింది. దీంతో సురేశ్, సుధీర్ బాబును గుంటూరులోని జైలుకు తరలించారు. ఫుల్ మూవీ అతి తొందరలో… ఏ తెర దొరికితే ఆ తెరపై!!