ప్రస్తుతం వినోదంతో కూడిన కార్యక్రమాలకే ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. దాన్ని క్యాచ్ చేసి ఎంటర్ టైన్ మెంట్ బేస్ తో కార్యక్రమాలు చేస్తున్న చానెళ్లు సక్సెస్ తో దూసుకుపోతున్నాయి. దానికి ఉదాహరణ జబర్దస్త్ అని చెప్పుకోవచ్చు. అయితే.. జబర్దస్త్ కు ఉన్న ఆదరణే వేరు. తెలుగు టెలివిజన్ చరిత్రలో జబర్దస్త్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.
జబర్దస్త్ వచ్చిన తర్వాత వేరే చానెళ్లలోనూ ఎన్నో కామెడీ షోలు వచ్చాయి కానీ.. ఏదీ జబర్దస్త్ అంత పాపులర్ కాలేదు. తర్వాత ఇటీవలే జీ తెలుగులో అదిరింది కామెడీ షోను ప్రారంభించారు. జబర్దస్త్ నుంచి సగం మంది ఇటు వచ్చినా.. చివరకు జబర్దస్త్ జడ్జి నాగబాబు ఇటు వచ్చి అదిరింది షోకు జడ్జిగా వ్యవహరించినా.. ఆ షోకు కూడా అంత ఆదరణ లభించలేదు.
దీంతో ఆ షోకు కొన్ని మెరుగులు దిద్ది… బొమ్మ అదిరింది పేరుతో మళ్లీ తీసుకొచ్చారు. కామెడీ డోస్ ను కూడా పెంచారు.
కట్ చేస్తే.. అదే జీ తెలుగు చానెల్ లో ఎంటర్ టైన్ మెంట్ కు సంబంధించి మరో షోను తెర మీదికి తీసుకొస్తున్నారు. అదే జీ ఎంటర్ టైన్ మెంట్ లీగ్ 2020. అక్టోబర్ 11న ప్రారంభం కానున్న ఈ షోలో రేణు దేశాయ్, శ్రీనివాస్ అవసరాల జడ్జీలుగా వ్యవహరించబోతున్నారట.
యాంకర్ రవి, శ్యామల యాంకర్లుగా వ్యవహరించనుండగా… ఈ షోలో ఎంటర్ టైన్ మెంట్ కు ఏమాత్రం కొదవ ఉండదు.. అని చెప్పేందుకు తాజాగా దాని ప్రోమోను రిలీజ్ చేశారు. ఆ ప్రోమో చూస్తే.. ఓవైపు డ్యాన్సులు.. మరోవైపు కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారని తెలుస్తోంది.
https://www.youtube.com/watch?v=ekgitF_29Gk