NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కాపులు ఓట్లు, కాపులు ఓట్లు, కాపులు ఓట్లు వీటి కోసం పడిచస్తున్న నాయకులు..!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని శాసించే ఓటు బ్యాంకు లలో కీలకమైన ఓటు బ్యాంకు కాపు ఓటు బ్యాంకు. 2014 ఎన్నికలలో చంద్రబాబు కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని కాపు ప్రాబల్యం ఎక్కువగా ఉండే రెండు గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాలు గెలిచి అధికారంలోకి రావడం జరిగింది. గతంలో చూస్తే కాపులు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి కీలకంగా ఉండేవారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగటంతో పవన్ పార్టీ ఎఫెక్ట్ తో 2014 ఎన్నికలలో చంద్రబాబు కి గంపగుత్తగా ఓట్లు వేశారు. ఆ తర్వాత జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికలలో జగన్ కి ఫేవర్ గా మారారు. కారణం చూస్తే 2014 ఎన్నికలలో కాపులను బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చి చంద్రబాబు మోసం చేయడం, అదే టైం లో ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ కూడా కామ్ గా ఉండటంతో….జరిగిన ఎలక్షన్ లో జనసేన పార్టీ ని  చాలావరకు కాపులు పక్కన పెట్టడం జరిగింది.

Pawan kalyan jagan and Chandrababu naidu In Guntur Districtపరిస్థితి ఇలా ఉండగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు కాపు ఓటు బ్యాంకును తమ సొంతం చేసుకోవడానికి అనేక తంటాలు పడుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బిజెపి పార్టీ కాపు ఓటు బ్యాంకును సొంతం చేసుకోవడానికి మొదటి నుండి అనేక స్ట్రాటజీలు వేస్తూనే ఉంది. దీనిలో భాగంగానే కన్నా లక్ష్మీనారాయణను బిజెపి అధ్యక్షుడిగా చేయటం అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ అధ్యక్షుడిగా చేసినా గాని… దాదాపు ఆ సందర్భంలో టిడిపి పార్టీ కనుసన్నల్లో బిజెపి నడవడం బహిరంగంగా కాకపోయినా లోలోపల టాక్ పబ్లిక్ లో మీడియాలో వినబడింది. కాగా వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడం తో బీజేపీ హైకమెండ్ ఎప్పుడైతే సోము వీర్రాజు ని బిజెపి పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఆ తర్వాత అధ్యక్ష పీఠం ఎక్కిన సోము వీర్రాజు బీజేపీలో టీడీపీ కోవర్టుగా పనిచేసేవారిని సోము వీర్రాజు తనదైన శైలిలో టార్గెట్ చేసి పక్కన పెట్టడం జరిగింది.

 

ఇదే రీతిలో మెగా కాంపౌండ్ కి చాలా దగ్గరవుతూ మెగా అభిమానులను కాపు ఓటు బ్యాంకును బిజెపికి మళ్ళించే రీతిలో సోము వీర్రాజు తనదైన శైలిలో స్ట్రాటజీలు ప్రస్తుతం వేస్తున్నట్లు టాక్. బిజెపి పార్టీ పరిస్థితి ఇలా ఉంటే, టిడిపి పార్టీ తిరిగి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నీ అమరావతి రాజధాని విషయాన్ని అడ్డం పెట్టుకుని తిరిగి తమ వైపు మళ్ళించడానికి, తద్వారా కాపులను తమవైపు తిప్పుకోవాలనే ఆలోచనలో ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క అధికారంలో ఉన్న వైఎస్ జగన్ కాపులకు సరికొత్త పథకాలు ప్రవేశ పెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఏపీ రాజకీయాలలో కాపుల ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీల అదినేత లు ఎవరికి వారు సరి కొత్త ఎత్తుగడలు వేస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ టాక్ గట్టిగా వినబడుతోంది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N