ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని శాసించే ఓటు బ్యాంకు లలో కీలకమైన ఓటు బ్యాంకు కాపు ఓటు బ్యాంకు. 2014 ఎన్నికలలో చంద్రబాబు కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని కాపు ప్రాబల్యం ఎక్కువగా ఉండే రెండు గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాలు గెలిచి అధికారంలోకి రావడం జరిగింది. గతంలో చూస్తే కాపులు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి కీలకంగా ఉండేవారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగటంతో పవన్ పార్టీ ఎఫెక్ట్ తో 2014 ఎన్నికలలో చంద్రబాబు కి గంపగుత్తగా ఓట్లు వేశారు. ఆ తర్వాత జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికలలో జగన్ కి ఫేవర్ గా మారారు. కారణం చూస్తే 2014 ఎన్నికలలో కాపులను బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చి చంద్రబాబు మోసం చేయడం, అదే టైం లో ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ కూడా కామ్ గా ఉండటంతో….జరిగిన ఎలక్షన్ లో జనసేన పార్టీ ని చాలావరకు కాపులు పక్కన పెట్టడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉండగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు కాపు ఓటు బ్యాంకును తమ సొంతం చేసుకోవడానికి అనేక తంటాలు పడుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బిజెపి పార్టీ కాపు ఓటు బ్యాంకును సొంతం చేసుకోవడానికి మొదటి నుండి అనేక స్ట్రాటజీలు వేస్తూనే ఉంది. దీనిలో భాగంగానే కన్నా లక్ష్మీనారాయణను బిజెపి అధ్యక్షుడిగా చేయటం అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ అధ్యక్షుడిగా చేసినా గాని… దాదాపు ఆ సందర్భంలో టిడిపి పార్టీ కనుసన్నల్లో బిజెపి నడవడం బహిరంగంగా కాకపోయినా లోలోపల టాక్ పబ్లిక్ లో మీడియాలో వినబడింది. కాగా వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడం తో బీజేపీ హైకమెండ్ ఎప్పుడైతే సోము వీర్రాజు ని బిజెపి పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఆ తర్వాత అధ్యక్ష పీఠం ఎక్కిన సోము వీర్రాజు బీజేపీలో టీడీపీ కోవర్టుగా పనిచేసేవారిని సోము వీర్రాజు తనదైన శైలిలో టార్గెట్ చేసి పక్కన పెట్టడం జరిగింది.
ఇదే రీతిలో మెగా కాంపౌండ్ కి చాలా దగ్గరవుతూ మెగా అభిమానులను కాపు ఓటు బ్యాంకును బిజెపికి మళ్ళించే రీతిలో సోము వీర్రాజు తనదైన శైలిలో స్ట్రాటజీలు ప్రస్తుతం వేస్తున్నట్లు టాక్. బిజెపి పార్టీ పరిస్థితి ఇలా ఉంటే, టిడిపి పార్టీ తిరిగి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నీ అమరావతి రాజధాని విషయాన్ని అడ్డం పెట్టుకుని తిరిగి తమ వైపు మళ్ళించడానికి, తద్వారా కాపులను తమవైపు తిప్పుకోవాలనే ఆలోచనలో ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క అధికారంలో ఉన్న వైఎస్ జగన్ కాపులకు సరికొత్త పథకాలు ప్రవేశ పెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఏపీ రాజకీయాలలో కాపుల ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీల అదినేత లు ఎవరికి వారు సరి కొత్త ఎత్తుగడలు వేస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ టాక్ గట్టిగా వినబడుతోంది.