అంతర్జాతీయ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఆన్ లైన్ బ్యాంకింగ్ పాల్పడుతున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు.
దేశవ్యాప్తంగా సుమారు పదకొండు వందల కోట్లకు పైగా ఇది ఆన్ లైన్ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఆన్ లైన్ మోసం చైనా దేశం వేదికగా ఈ మాఫియా సామ్రాజ్యం కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించి ఈ కేసులో చైనా వ్యక్తితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు.ఈ ఆన్ లైన్ మాఫియా ముఠా దేశంలో యువతను టార్గెట్ చేసుకుని చైనా ఆన్ లైన్ గేమ్స్ ద్వారా మోసానికి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
దీంతో వివిధ బ్యాంకుల్లో ని ఖాతాలో ఉన్న 30 కోట్లు సీజ్ చేశారు. పొకో పేరుతో ఆన్ లైన్ లో బెట్టింగ్ కి పాల్పడుతోంది ఈ చైనా కంపెనీ. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కంపెనీలో చైనా మరియు ఇండియా దేశానికి చెందిన డైరెక్టర్లు ఉన్నారని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. అంతేకాకుండా ఐటి శాఖకు సమాచారం ఇచ్చామని, ఆన్ లైన్ గేమ్ తెలంగాణ రాష్ట్రంలో రద్దయిందని పేర్కొన్నారు.