దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. పలు రకాలుగా జాగ్రత్తలు పాటిస్తున్న నేతలు, ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతూనే ఉన్నారు.ఇప్పటికే అనేక మంది పార్లమెంట్ సభ్యులు కరోనా బారిన పడి చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ రోజు తాజాగా మరో సీనియర్ పార్లమెంట్ సభ్యుడు కరోనా బారిన పడ్డారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ గులాం నబీ ఆజాద్ కి నేడు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్టు వెల్లడించారు ఆజాద్. కొద్ది రోజులుగా తనతో కాంటాక్ట్ అయిన నేతలు కోవిడ్ -19 ప్రోటోకాల్ పాటించాలి అయన సూచించారు.
ఇప్పటికే ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితర ప్రముఖులు, ఎంపీలు కరోనా బారిన పడి కోలుకున్నారు.