హైదరాబాద్, జనవరి 27: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్తో తన కుమారుడు కలసి పయనిస్తాడని మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు హైదరాబాద్లో ఆదివారం జగన్తో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, అతని కుమారుడు హితేశ్లు కలసి చర్చలు జరిపారు. అనంతరం దగ్గుబాటి మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు హితేశ్ వైసిపిలోకి రావడాన్ని జగన్ స్వాగతించారని వెల్లడించారు.
తన సతీమణి దగ్గుబాటి పురంధేశ్వరి ప్రస్తుతం భారతీయ జనతాపార్టీలోనే ఉన్నారని ఆయన చెప్పారు. కుమారుడు వైసిపిలో చేరడానికి బిజెపి అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆమె పార్టీ నుండి వైదొలుగుతారని ఆయన స్పష్టం చేశారు.
రానున్న ఎన్నికల్లో ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసిపి టిక్కెట్ తన కుమారుడికి ఇప్పించేందుకు దగ్గుబాటి చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
దగ్గుబాటి సతీమణి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి ప్రస్తుతం భారతీయ జనతాపార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. బిజెపి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మేనిఫేస్టో కమిటీ చైర్మన్గా ఆమె వ్యవహరిస్తున్నారు.
పరుచూరు మాజీ శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర రావు, కుమారుడు దగ్గుబాటి హితేష్ లతో వైయస్ జగన్ భేటీ.#APNeedsYSJagan pic.twitter.com/MTniBg8M77
— YSR Congress Party (@YSRCParty) January 27, 2019