Breaking News: ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల రద్దు పిటిషన్ పై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. రినోటిఫికేషన్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ డివిజనల్ బెంచ్ సరికొత్త ఆదేశాలు.. జారీ చేయడం జరిగింది. రిట్ అప్పీల్ పరిష్కారమయ్యే వరకు కౌంటింగ్ నిర్వహించవద్దని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సమగ్ర విచారణ జూలై 27కి వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు డివిజినల్ బెంచ్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఈ క్రమంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా స్టేట్ ఎన్నికల కమిషన్ నాలుగు వారాలకు ముందు ఎలక్షన్ కోడ్ అమలు చేయకుండా జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు నిర్వహించిందని సింగిల్ బెంచ్ .. మళ్లీ ఎన్నికలకు సంబంధించి రీ నోటిఫికేషన్ జారీ చేయాలని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో స్టేట్ ఎన్నికల కమిషన్ డివిజనల్ బెంచ్ లో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రిట్ అప్పీల్ వేయ్యగా తాజాగా డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడం జరిగింది.