(బీహార్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
మూడు దశలలో జరగాల్సిన బీహార్ శాసనసభ ఎన్నికలలో మొదటి దశ నేడు ప్రారంభమైంది. మొదటి దశ లో భాగంగగా రాష్ట్రంలోని 243 సీట్లలో 71 స్థానాల్లో ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఉదయం 11గంటల లోపల 8 శాతం పోలింగ్ నమోదు అయింది. కరోనా నేపధ్యం లో పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ,థర్మల్ స్కానర్లును, హ్యాండ్ శానిటైజర్, సబ్బు మరియు నీరు ఓటర్లకు అందుబాటులో వుంచారు. కొన్ని చోట్ల ఈవీఎం లు మొరాయించినందున పోలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యంగ మొదలయింది.వోటింగ్ హక్కు వినియోగించుకోవడానికే ఉదయం నుండి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు.
అయితే లఖిసరాయ్ లో మైదానంలో మ్యూజియం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిరసనగా గ్రామస్థులు ఓటింగ్ను బహిష్కరించడo వలనా గ్రామంలోని 115వ పోలింగ్ బూత్ ఓటర్లు లేక వెలవెలబోయింది. ఇదే విషయాన్ని పోలింగ్ కేంద్రం ఎన్నికల పర్యవేక్షణ అధికారి మహమ్మద్ ఇక్రాముల్ హక్ తెలిపారు. ఇది ఇలా ఉండగా ఔరంగాబాద్లోని ధిబ్రా ప్రాంతంలో తనిఖీలు జరుపుతుండగా రెండు ఐఈడీ బాంబులను భద్రత సిబంది గుర్తించింది. ఆ బాంబులను సీఆర్పీఎప్ నిర్వీర్యం చేసింది.
కరోనా సంక్షోభం లో జరుగుతున్న తొలి విడత బీహార్ ఎన్నికల నేపథ్యంలో ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ద్వారా ప్రజల్ని కోరారు. కొవిడ్-19 జాగ్రత్తలు పాటిస్తూ. పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఆరు అడుగుల భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నారు.
కొందరు ప్రముఖులు ఉదయానే తమ వోట్ హక్కును వినియోగించుకున్నారు. బిజెపి నాయకుడు ప్రేమ్ కుమార్ తన పార్టీ చిహ్నంతో ఉన్న మాస్క్ ను ధరించి గయాలోని ఒక పోలింగ్ బూత్ వద్ద తన వోట్ ను వేశారు.జముయికి చెందిన బిజెపి అభ్యర్థి, షూటర్ శ్రేయాసి సింగ్ జిల్లాలోని నయా గావ్ ప్రాంతంలోని పోలింగ్ బూత్ వద్ద ఓటు వేశారు.
ససారాం అసెంబ్లీ సీటులోని ఒక పోలింగ్ స్టేషన్ వద్ద వోట్ హక్కు వినియోగించుకోవదడానికి వచ్చిన 65 ఏళ్ల ఓటరు హీరా మహతో అపస్మారక స్థితిలో మరణించినట్లు తెలిసింది.