Telangana : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అన్ని విద్యాసంస్థలు క్లోజ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తెలపడం మనకందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కరోనా కేసులు ఊహించని విధంగా పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది
కాగా తాజాగా తెలంగాణలో మరికొద్ది రోజుల్లో జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా త్వరలో డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ రీషెడ్యూల్ చేస్తామని వాటికి సంబంధించిన తేదీలు ప్రకటిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ జైపాల్ రెడ్డి తెలిపారు. అధ్యాపకులు మరియు విద్యార్థులు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.