ఇటీవల జూన్ 15వ తారీఖున భారత్-చైనా సరిహద్దు ప్రాంతం గాల్వాన్ లోయలో ఇండియన్ ఆర్మీ చైనా ఆర్మీ కి మధ్య గొడవ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. డ్రాగన్ కంట్రీకి చెందిన సైనికులు కవ్వింపు చర్యల తో అక్రమంగా మన దేశ సరిహద్దుల్లోకి రావడంతో వెంటనే మన దేశ సైనికులు ఎక్కడా తగ్గకుండా చైనాతో పోరాడటం జరిగింది. ఆయుధాలు ఏమీ లేకుండా తల పడినా ఇరుదేశాల సైనికుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరగడం జరిగింది. అయితే జరిగిన ఈ ఘటనలో ఇండియా 21 మంది సైనికుల ప్రాణాలను పోగొట్టుకోవటం అందరికీ తెలిసిందే.
అయితే ఈ ఘటనలో చైనా కి చెందిన సైనికులు కూడా చనిపోవడం జరిగింది. అయితే చైనా ఈ విషయంలో ఎంత మంది చనిపోయారు అధికారికంగా ప్రకటించలేదు. ఇలాంటి తరుణంలో గాల్వాన్ లోయలో ఇండియన్ ఆర్మీ చేతిలో దాదాపు 100 మంది చైనా సైనికులు మరణించినట్లు ఆ దేశానికి చెందిన మాజీ సైనికాధికారి జినాలి యాంగ్ పేర్కొన్నారు. గతంలో ఇదే విషయాన్ని ఇండియన్ ఇంటిలిజెన్స్ వెల్లడించడం జరిగింది. చైనా కావాలనే తన దేశానికి చెందిన సైనికుల మరణవార్త బయట పెట్టకుండా దాస్తుంది అని చెప్పుకొచ్చింది. ఇటువంటి తరుణంలో ఇండియన్ ఆర్మీ చేతిలో దాదాపు వంద మంది కంటే ఎక్కువ చైనా ఆర్మీ సైనికులు చనిపోయినట్లు ఆ దేశానికి చెందిన మాజీ సైనికాధికారి చెప్పటంతో ఈ వార్త విని ప్రపంచదేశాలు ఒక్కసారిగా షాక్ అవుతున్నాయి. మరోపక్క కొన్ని దేశాలు ఇండియాతో చైనా యుద్దానికి దిగితే భారీ స్థాయిలో మూల్యం చెల్లించుకోవడం ఖాయం అంటూ ఈ లెక్కలు విని కామెంట్ చేస్తున్నాయి.