2017 నుండి ఐ.పి.ఎల్ ట్రోఫీకి స్పాన్సర్ గా ఉన్న చైనా మొబైల్ దిగ్గజ కంపెనీ వివో ఇటీవల సడన్ గా తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో సెప్టెంబర్ లో ప్రారంభంకానున్న ఐపీఎల్ మ్యాచ్ లకు సన్నాహాలు చేస్తున్న బిసిసిఐకి ఒక్కసారిగా వివో షాక్ ఇచ్చినట్లు అయింది. దీంతో ఐపీఎల్ కొత్త టైటిల్ స్పాన్సర్ కోసం బీసీసీఐ వెతుకులాట ప్రారంభించింది. UAE వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా ఈ తక్కువ టైంలోనే కొత్త స్పాన్సర్ మీ వెతుకులాట పనిలో BCCI తలమునకలైంది.
ఇప్పటికే అమెజాన్, జియో, టాటా గ్రూప్, డ్రీమ్ 11, బైకు యాప్ కంపెనీలు రేస్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పతాంజలి గ్రూప్ వ్యవస్థాపకుడు రాందేవ్ బాబా టైటిల్ స్పాన్సర్షిప్ కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లు పతాంజలి గ్రూపు ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. పతాంజలి గ్రూపు గ్లోబల్ మార్కెట్ లో ఓ బ్రాండ్ గా ఎదగటానికి ఐపీఎల్ నుంచి ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్నట్లు దీనిని ఒక అవకాశంగా భావిస్తున్నామని తెలిపారు. మరోపక్క పతాంజలి ప్రొడక్ట్స్ కి గ్లోబల్ మార్కెట్ తరహాలో డిమాండ్ పెద్దగా లేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. మరి BCCI ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా ఎవరికి అవకాశం ఇస్తుంది అన్నది సస్పెన్స్ గా మారింది.
చాలావరకు అందుతున్న సమాచారం ప్రకారం రాందేవ్ బాబా కి టైటిల్ స్పాన్సర్ షిప్ ఇప్పించడానికి ఓ ప్రముఖ రాజకీయ పార్టీ నేతలు రంగంలోకి దిగినట్లు, బీసీసీఐ తో మంతనాలు జరిపినట్లు, అంతా ఓకే అయినట్లు, అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే వాస్తవమైతే ఇక రాందేవ్ బాబా ఐపీఎల్ స్పాన్సర్ గా రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తం గా మారుమ్రోగుతూ పతంజలి మార్కెట్ విస్తరించటం గ్యారెంటీ.