అమరావతి, జనవరి 16: ఎపి ప్రతిపక్ష నాయకుడు, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి రేపు రాత్రి లండన్ బయలుదేరి వెళుతున్నారు. ఐదు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. తిరిగి ఈ నెల 22వ తేదీ రాత్రి హైదరాబాదుకు చేరుకుంటారు. జగన్ కుమార్తె వర్ష లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లో విద్యను అభ్యసిస్తున్న విషయం విదితమే. కుమార్తెతో ఐదు రోజులు గడిపేందుకు కుటుంబ సమేతంగా లండన్ వెళుతున్నారు. దాదాపు ఎడాది పాటు పాదయాత్ర నిర్వహించిన జగన్ ప్రస్తుతం హైదరాబాదులోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
previous post
next post