గత కొన్నాళ్ల నుండి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీ నేతలు గాని కేసీఆర్ గాని కొట్టిపారేయలేదు. ఇదే తరుణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ని టార్గెట్ చేస్తూ టిఆర్ఎస్ పార్టీ నేతలు గత నాలుగు నెలల నుండి విమర్శలు చేస్తూనే ఉన్నారు. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇటువంటి తరుణంలో తాజాగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో కొత్తగా కేంద్రం తెచ్చిన విద్యుత్ చట్టాన్ని కూడా కేసీఆర్ ఇది తేనె పూసిన కత్తి అన్నట్టు అభివర్ణించారు.
ఇదిలా ఉండగా జాతీయ స్థాయిలో కేసీఆర్“నయా భారత్” అనే పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నట్లు ఇటీవల వార్తలు రావడం మనకందరికీ తెలిసిందే. కాగా ఈ “నయా భారత్” పార్టీని జాతీయ స్థాయిలో బలోపేతం చేయడం కోసం చాలా పెద్ద రిస్క్ చేయడానికి కేసిఆర్ వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకున్నట్లు టాక్. పూర్తి విషయంలోకి వెళ్తే జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం తీసుకొచ్చిన కొత్త విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ….బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అన్నరీతిలో సరికొత్త ఉద్యమాన్ని కేసిఆర్ త్వరలో మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్టు టాక్.
ఈ నినాదంతో దేశవ్యాప్తంగా మోడీ పై వ్యతిరేకత తీసుకురావాలని ఇప్పటి నుండే కేసీఆర్ యోచన చేస్తున్నట్లు వార్తలు నేషనల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తెలంగాణ ఉద్యమం మాదిరిగా ఇది క్లిక్ అయితే మాత్రం బిజెపి పార్టీకి చాలావరకు డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోపక్క త్వరలో జిహెచ్ఎంసి ఎన్నికలు జరగనున్న తరుణంలో… మొత్తం స్థానాలు టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుని అప్పటినుండి ఇక పూర్తిగా నేషనల్ పాలిటిక్స్ పై కేసీఆర్ దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా త్వరలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జాతీయస్థాయిలో రాజకీయాలు చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు బలంగా వినబడుతున్నాయి.