కేరళ విమాన ప్రమాదంలో 15 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. “వందే భారత్ మిషన్” లో భాగంగా దుబాయ్ నుంచి కోజికోడ్ కి వచ్చిన విమానం భారీ వర్షం కారణంగా రన్ వే పై జారిపడి రెండు ముక్కలయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 191 మంది ఉండగా ఇద్దరు పైలెట్లు తో సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదానికి గల కారణం గురించి ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఇదిలా ఉండగా ప్లేన్ క్రాష్ అయిన వెంటనే CISF కంట్రోల్ రూమ్ స్థానిక పోలీసులకు మరియు ఏజెన్సీ యొక్క యూనిట్లకు సమాచారం అందించడం తో ప్రమాదం జరిగిన ఐదు నుంచి ఏడు నిమిషాల్లో ఆ ప్రాంతంలో ఉన్న నివాసితులు… రెండు ముక్కలైన ప్లైన్ నుండి గాయపడిన వారిని రక్షించడం జరిగింది.
పరిమితుల సంఖ్యలో స్థానికులను అనుమతించి, రక్షణ చర్యలు చేపట్టడంతో సకాలంలో ఈ నిర్ణయం సిఐఎస్ఎఫ్ వర్గాలు తీసుకోవటంతో ….. మృతుల సంఖ్యను తగ్గించినట్లు అయిందని, చాలా మందిని కాపాడినట్లు అయ్యింది. ఆ అయిదు నిమిషాలలో స్థానికులు విమాన ప్రమాదంలో ఘోరంగా గాయపడిన వారిని సకాలంలో హాస్పిటల్లో చేర్చడంతో చాలావరకు ప్రాణనష్టం జరగలేదు. ఇదే విషయాన్ని ఓ జాతీయ మీడియా ఛానల్ రిపోర్ట్ రిలీజ్ చేసింది.
సరిగ్గా రాత్రి 7 గంటల 40 నిమిషాలకు ప్లేన్ క్రాష్ అయిన వెంటనే మొదట సీఐఎస్ఎఫ్ ఆఫీసర్కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. 7:40 కి ప్లేన్ క్రాష్ అవడం గమనించిన గేట్ నెం.8 అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ సీఐఎస్ఎఫ్ కమాండ్ కంట్రోల్ రూమ్కి సమాచారం ఇచ్చారు. 7:41కి సీఐఎస్ఎఫ్ కంట్రోల్ రూమ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అండ్ సీఐఎస్ఎఫ్ క్విక్ రెస్పాన్స్ రూమ్కి ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు.
7:42కి ఎయిర్పోర్ట్ ఫైర్ స్టేషన్ను అలర్ట్ చేశారు. 7:43కి సీఐఎస్ఎఫ్ ఎయిర్పోర్ట్ హెల్త్ డిపార్ట్మెంట్కు కాల్ చేశారు. 7:44 సీఐఎస్ఎఫ్ కంట్రోల్ రూమ్ టర్మినల్ మేనేజర్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్, ఎయిర్పోర్ట్ హెల్త్ డిపార్ట్మెంట్కు రెండోసారి కాల్ చేశారు. 7:45కి సీఐఎస్ఎఫ్ కంట్రోల్ రూమ్ లోకల్ పోలీసులు, ఏజెన్సీ యూనిట్ లైన్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రమాదం జరిగిన 5 – 7 నిమిషాల్లో క్రాష్ గురించి తెలుసుకున్న స్థానికులు క్రాష్ గేట్ దగ్గరికి చేరుకున్నారు. పరిమితుల సంఖ్యలో స్థానికులను ప్రమాద ఘటనా స్థలానికి పంపించి ప్రాణ నష్టం నివారించారు. ఇదే విషయాన్ని ప్రయాణికులు కూడా చెప్పుకొస్తున్నారు.