ప్రపంచంలో ఉత్తర కొరియా దేశం పేరు చెప్పగానే నియంత పాలన, కఠినాతి కఠినమైన శిక్షలు టక్కున గుర్తు కోస్తాయి. దానికి కారణం ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కేసులు ఆ దేశంలో ఇప్పటి వరకు పెద్దగా నమోదు కాకపోవడం ప్రపంచానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దానికి కారణం ఎవరైనా కరోనా బారిన పడితే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం జరుగుతుందని కిమ్ ఆదేశాలు ఇవ్వటం. అలాంటి చోట్ల ఇప్పుడు సెక్స్ రాకెట్ ఉదాంతం బయటపడటంతో…. దానికి సూత్రధారులు అయిన ఆరుగురు నిందితులను రాజధాని నగరంలో బహిరంగంగా తీసుకువచ్చి కాల్చి చంపించాడు కిమ్ జాంగ్ ఉన్.
వ్యభిచారం చేశారని తేలడంతో ఆరుగురికి బహిరంగ మరణశిక్ష అమలు చేయడంతో ఇప్పుడు ఉత్తర కొరియా పేరు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగింది. ప్యోంగ్ యాంగ్ నగరంలో బయటపడిన ఈ ఉదంతంలో పాల్గొన్నది అంతా 20 ఏళ్లలోపు అమ్మాయిలు. పైగా ఆ ప్రాంతానికి చెందిన పలు కాలేజీలో చదువుతున్న విద్యార్థులు. తమ పాకెట్ మనీ కోసం ఈ కాలేజీ అమ్మాయిలు కొంతమంది రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి డబ్బులు సంపాదించుకుంటున్నారు అని కిమ్ జాంగ్ ఉన్ దృష్టికి రావడంతో, ఈ ఘటనపై సీరియస్ విచారణ చేయించారు.
ఈ ఘటనలో చాలావరకు కిమ్ జాంగ్ ఉన్ పార్టీకి చెందిన వాళ్లు, ప్రభుత్వానికి సంబంధించిన కీలక నాయకులు కూడా ఉన్నా గాని ఏమాత్రం కనికరం చూపకుండా వారందరినీ అరెస్టు చేయించాడు. కీలకమైన నిందితులను బహిరంగంగా తీసుకువచ్చి ఉత్తర కొరియా రాజధాని నగరం నడిబొడ్డులో కాల్చి చంపించారు. దీంతో మరొకసారి కిమ్ జాంగ్ ఉన్ పేరు ప్రపంచవ్యాప్తంగా హైలెట్ అయ్యింది. ముఖ్యంగా విద్యార్థులు ఈ విధంగా సెక్స్ రాకెట్ లో పలు సార్లు పట్టుబడిన తరుణంలో వాళ్ళకి శిక్షలు వేసిన వారిలో మార్పులు రాకపోవడంతో ఈ విధంగా బహిరంగ శిక్షలకు కిమ్ జాంగ్ ఉన్ రెడీ అయ్యారట. విద్యార్థులకి వ్యభిచారం చేయాలంటే భయం కలిగించే రీతిలో శిక్ష ఉండాలని ఈ బహిరంగ శిక్షకి తాజాగా అధ్యక్షుడు ఆదేశించినట్లు అక్కడి ప్రభుత్వం ప్రచారం చేస్తోంది.