ఏపీ రాజకీయాలలో కీలక ముఖ్యమంత్రులుగా రాణించిన చంద్రబాబు మరియు వైయస్ రాజశేఖర్ రెడ్డి లపై బయోపిక్ రానున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్త చక్కర్లు కొడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుండి రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు గా మంచి సాహిత్య స్నేహం కూడా ఉంది. అయితే ఎప్పుడైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు టిడిపి పార్టీ ని స్థాపించడం జరిగిందో వెంటనే చంద్రబాబు తన మామ రామారావు టిడిపి పార్టీ లోకి వెళ్లిపోవడం జరిగింది.
దీంతో వైయస్ మరియు చంద్రబాబు మధ్య సైద్ధాంతిక విభేదాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఇద్దరూ రాజకీయంగా ప్రత్యర్థులు అయ్యారు. అసెంబ్లీ లోనూ బయట కూడా ఒకరిని ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ… ఎవరికి వారు తమ పార్టీలలో తమదైన ముద్ర వేశారు. ముఖ్యమంత్రిగా కూడా ఇద్దరూ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు లో ఎవరికి వారు ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు. రాజకీయంగా పార్టీలు అంతా వేరైనా గాని వ్యక్తిగతంగా వీరిద్దరూ ఉన్న స్నేహాన్ని అలాగే కొనసాగించారని ఇప్పటికే కొంతమంది సీనియర్ రాజకీయ నేతలు చెబుతుంటారు.
అలాంటి వైఎస్ చంద్రబాబు స్నేహం పై తాజాగా తెలుగులో ఓ సినిమా నిర్మించడానికి ఏర్పాట్లు రెడీ అవుతున్నట్లు సమాచారం. పొలిటికల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది?, వీరి స్నేహం ఎలా చిగురించింది?, ప్రత్యర్థులుగా ఎలా మారారు వంటి విషయాలను… తెరపై చూపించడానికి ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించిన విష్ణు ఇందూరి, తిరుమల రెడ్డి కలిసి ఈ సినిమా నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకి రాజు దర్శకత్వం బాధ్యతలు చేపడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా సినిమాలో చిన్నప్పటి పాత్రలో వైయస్ జగన్ పాత్ర ఉంటుందని… ఓ సన్నివేశంలో చంద్రబాబు వైఎస్ ఇంటికి వచ్చిన టైం లో జగన్ నీ చూసి చంద్రబాబు తన అభిప్రాయం చెప్పే సీన్ ఈ సినిమాలో ఉన్నట్లు టాక్.
Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!