ఇటీవల ఈడి డిపార్ట్మెంట్ చైనా జాతీయుడిని అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటి డిపార్ట్ మెంట్ సదరు చైనీయుడిని విచారిస్తున్న క్రమంలో అనేక విషయాలు బయటపడుతున్నాయి. దాదాపు వెయ్యి కోట్లు మనీలాండరింగ్ పాల్పడిన ఇతడు…. భారత దేశానికి సంబంధించి రహస్యాలు చైనా దేశానికి రహస్యంగా పంపుతున్నట్లు గుర్తించారు. ఇందుకోసం ప్రభుత్వ సంస్థలలో పనిచేసే అధికారులకు లక్షలకొద్దీ కూడా ఇచ్చినట్లు విచారణలో తేలింది.
చార్లీ పెంగ్ అనే ఈ చైనా జాతీయుడు నీ 2018 లోనే అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత బెయిల్ పై బయటికి వచ్చేశాడు. అయితే బయటకు వచ్చినా చార్లీ పెంగ్ డిబేట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా పై కన్నేసి, ఢిల్లీలో దలైలామా శరణార్థ శిబిరాల వద్ద ఉండే టిబేట్ వాసులకు లంచాలు ఇచ్చి దలైలామా కి సంబంధించిన సమాచారం రహస్యంగా చైనాకి పంపుతున్నట్లు తాజా విచారణలో గుర్తించారు.
పెంగ్ 2014 సంవత్సరంలో నేపాల్ మార్గం ద్వారా భారత్ లో చొరబడి మిజోరం కి చెందిన ఓ మహిళను వివాహం చేసుకుని ఆధార్ కార్డు సంపాదించాడు. ఆ తరువాత మనీలాండరింగ్ కి పాల్పడుతూ అనేక బ్యాంక్ ఖాతాలు తెరిచి హవాలా రూపంలో చైనా కి డబ్బులు పంపుతున్నట్లు తాజా విచారణలో తేలింది. మొత్తంమీద చూసుకుంటే చైనా దేశానికి ఒక గూడచారి లాగా భారత్ లో పెంగ్ వ్యవహరించినట్లు గుర్తించి అధికారులు ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నారు.