హైదరాబాద్: రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డిని నియమించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. త్వరలోనే రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యుల నియామకం చేపట్టనున్నట్లు వెల్లడించారు. జూన్లోపు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు రైతు సమన్వయ సమితి బలోపేతం చేయనున్నారు.
రైతుసమన్వయ సమితి అధ్యక్షునిగా తనను నియమించాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం సిఎంను ఆయన ప్రగతిభవన్ లో కలిసి ధన్యవాదాలు చెప్పారు. రాజేశ్వర్ రెడ్డిని ముఖ్యమంత్రి అభినందించారు. రైతులకు అన్ని వేలలా అండదండగా ఉండే విధంగా రైతు సమన్వయ సిమితులను సమర్థవంతంగా నిర్వహించాలని రాజేశ్వర్ రెడ్డి కోరారు.
రాష్ట్రంలో రైతుల సమస్యలను తీర్చడానికి సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేశారు. గతంలో రైతు సమన్వయ సమతి చైర్మన్ గా ఉన్న మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మల్సీ అయి.. కౌన్సిల్ చైర్మన్ అయ్యారు. దాంతో ఆ పదవిని ఇప్పుడు పల్లాకు కేటాయించారు సీఎం కేసీఆర్. హుజూర్ నగర్ ఉపఎన్నికలో గెలుపు కోసం పల్లా ఎంతో శ్రమించారు. నిజానికి హుజుర్ నగర్ ఉప ఎన్నిక ఇంచార్జిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సక్సెస్ అవ్వడంతో మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా సీఎం కేసీఆర్ పల్లాకు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియమించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.