NTR : నటుడు వైసిపి మద్దతుదారుడు పోసాని కృష్ణ మురళి తాజాగా చంద్రబాబు పై అదేవిధంగా ఎన్టీఆర్ పై కీలక కామెంట్లు చేశారు. చంద్రబాబు నాయుడు అవసరం ఉంటే వాడటంలో..ఆయనను మించిన వారు మరొకరు లేరని పేర్కొన్నారు. అవసరం తీరిపోయాక పక్కన పెట్టేస్తారు అంటూ సెటైర్లు వేశారు.
పవన్ విషయంలో అదే విధంగా ఎన్టీఆర్ విషయంలో ఇదే జరిగింది అంటూ స్పష్టం చేశారు. విభజన జరిగిన తరువాత 2014 ఎన్నికల సమయంలో..చంద్రబాబు ముఖ్యమంత్రి అవటానికి పవన్ కళ్యాణ్ టీడీపీ ని గెలిపించడానికి బాగా కృషి చేశారని..ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో పవన్ ని పొగడ్తలతో ముంచెత్తారు అని పేర్కొన్నారు.
కానీ 2019 ఎన్నికల టైంలో చంద్రబాబు కొడుకు లోకేష్ పై పవన్ విమర్శలు చేయడంతో ఆయనను పక్కన పెట్టేశారు అంటూ పోసాని స్పష్టం చేశారు. దీనిబట్టి పొగిడితే ఒకలాగా విమర్శిస్తే మరొక లాగా చంద్రబాబు మెంటాలిటీ ఉంటుంది అంటూ మండిపడ్డారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇదే జరిగిందని పేర్కొన్నారు. సీఎం వాళ్ళ తాత ఎన్టీఆర్ మాదిరిగా వాగ్దాటి కలిగిన ఎన్టీఆర్ 2019 ఎన్నికల సమయంలో ఖాకీ చొక్కా వేసుకొని రాష్ట్రమంతా పార్టీ కోసం ప్రచారం చేశారని ..ఎన్నికల ప్రచారం తర్వాత ఎన్టీఆర్ ని పట్టించుకున్న దాఖలాలు లేవు అంటూ మండిపడ్డారు.
అంతేకాకుండా ఎన్టీఆర్ హీరో కాకముందు ఎవరో కూడా ఆయనతో మాట్లాడలేదని ఒక్కరు కూడా పలకరించినా పాపాన పోలేదని పేర్కొన్నారు. అటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరో గా రాణిస్తున్నాడు అంటూ పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ ని అప్పట్లో చంద్రబాబు తో సహా కుటుంబ సభ్యులంతా ఒక అనాధ మాదిరిగా చూశారని పోసాని కీలక కామెంట్లు చేశారు. ఎన్టీఆర్ కి ఏ మాత్రం రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఖచ్చితంగా టిడిపి వైపు మళ్లీ చూసే ప్రసక్తి ఉండదు అని తాను అనుకుంటున్నట్లు పోసాని కృష్ణ మురళి కీలక వ్యాఖ్యలు చేశారు.