Raghu Ramakrishnam Raju Case: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్ హైకోర్టు సింగిల్ జడ్జి డిస్మిస్ చేయడంతో సుప్రీంకోర్టు ని ఆశ్రయించడం తెలిసిందే. సుప్రీంకోర్టులో రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాదులు బలంగా తమ వాదనలు వినిపించారు. ముఖ్యంగా పోలీసులు బాధ్యతాయుతమైన ఎంపీ పై చేయి చేసుకున్నట్లు న్యాయమూర్తి ముందు స్పష్టం చేశారు. అయితే వాదనలు విన్న సుప్రీంకోర్టు రఘురామ కృష్ణం రాజు బెయిల్ పిటిషన్ విచారణ శుక్రవారానికి వాయిదా వేయటం జరిగింది.
ఇదే టైములో బెయిల్ పిటిషన్ పై గురువారం కౌంటర్ దాఖలు చేయాలి సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. ఇక రఘురామకృష్ణంరాజు కాళ్ళకి గాయాలకు సంబంధించి సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించాలి అని ఆదేశాలు జారీ చేసింది. అంతమాత్రమే కాకుండా వైద్య పరీక్షలు జుడిషియల్ కస్టడీ లో భాగంగా వీడియో చిత్రీకరణ రూపంలో జరగాలని పేర్కొంది. మొత్తం వైద్య పరీక్షలు నిర్వహించి సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 21 శుక్రవారం తదుపరి విచారణ నిర్వహిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.