AP CM YS Jagan: ఏపిలో కర్ప్యూను ఈ నెలాఖరు వరకూ పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితాలు రావాలంటే కనీసం నాలుగు వారాలు కర్ఫ్యూ ఉండాలని సీఎం వైఎస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ విధించి సుమారు పది రోజులే దాటిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని అదికారులకు సీఎం ఆదేశించారు.
కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో ఏపిలో లాక్ డౌన్ విధించాలన్న డిమాండ్ వినబడుతోంది. దీనిపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. కనీసం నాలుగు వారాల పాటు కర్ఫ్యూ అమలు చేస్తే ఫలితాలు కనబడతాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సమీక్ష జరిపిన సీఎం వైఎస్ జగన్ మరో రెండు వారాలు కర్ఫ్యూ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు.
AP CM YS Jagan: అనాధలైన పిల్లలను ఆదుకునేందుకు..
ఇదే సమయంలో మరో కీలక నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వారిని ఆదుకునేలా ఆర్థిక సహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. వారి పేరు మీద కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసేలా, దానిపై వచ్చే వడ్డీ ప్రతి నెలా వారి ఖర్చుల కోసం అందేలా ఆలోచనలు చేయాలని అధికారులను ఆదేశించారు.
మధ్యప్రదేశ్ లో కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు అక్కడి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉచిత విద్య, ఉచిత రేషన్ సరఫరాతో పాటు నెలకు రూ.5వేలు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఏపిలో సీఎం జగన్ అదే తరహా కాకపోయినా దాని కంటే మెరుగుగా పిల్లలను ఆదుకునేందుకు కార్యాచరణకు సిద్ధం చేస్తున్నారని టాక్.