ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. సాధారణంగా వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవు ఉంటే ప్రభుత్వాలు 31వ తేదీనే జీతాలు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఏపీ సర్కార్ ఖజానాలో అందుకు సరిపడ సొమ్ములేదు. ఉన్నదంతా సామాజిక పెన్షనర్లకు ఇచ్చేశారు. ఇక ఇప్పుడు ప్రభుత్వం అప్పులు కోసం చూస్తోంది. ఆర్బీఐ నుండి ప్రతి మంగళవారం రెండు వేల కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో తీసుకునే అవకాశం రాష్ట్రానికి ఉంది. అంతే కాకుండా ఏపీ ప్రతీ మంగళవారం అలా తీసుకుంటూనే ఉంది. నాలుగో తేదీన…. మంగళవారం మరోసారి రెండు వేల కోట్ల అప్పు ను తీసుకోనున్నారు.
ఇదిలా ఉండగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయడానికి కనీసం బుధవారం సాయంత్రం అయితే…. ఐదో తేదీకి అందులో రాష్ట్ర కథకు జమ అవుతాయి. ఆ తర్వాత వాటి నుండి ఉద్యోగులకు జీతాలు చెల్లిచారి. గత నెల కూడా ఏదో సాంకేతిక సమస్యలు అంటూ గవర్నర్ దగ్గర నుండి బిల్లు ఆమోదం తీసుకున్న తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి రెండు మూడు రోజుల సమయం పట్టింది.ఈ లోపల పన్నుల ద్వారా కొంత మొత్తం వసూలు అవుతుంది. అవి కూడా సరిపోయే అవకాశం లేదు. అందుకే ఐదో తేదీకి కూడా అందరికీ జీతాలు అందే అవకాశం అయితే ఇప్పుడు గగనమే. ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ల కోసం కనీసం ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కావాలి.
కాబట్టి సగం మందికి తర్వాత నిధులు సమీకరించుకునే వరకూ నిధులు పెండింగ్ పడే అవకాశం ఉందని అంటున్నారు.నిజానికి ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే ప్రభుత్వం 30 వేల కోట్ళ రూపాయల అప్పు చేసింది జగన్ సర్కారు. ఈ నిధులన్నీ ఉంటాయని.ప్రభుత్వానికి ఇబ్బంది లేదని అనుకున్నారు కానీ ఈ అప్పుల దెబ్బతో ఆ సొమ్మును ప్రభుత్వం వద్ద లేదని తేలిపోయింది. గత నెలలో కూడా దాదాపు రూ. 10 వేల కోట్లకు పైగా అప్పులు చేసినట్లుగా తెలుస్తోంది.
ఆర్బీఐ ద్వారానే ఇంత మొత్తం చేశారని… ఇక ఆఫ్ మార్కెట్ రుణాలు మరింత ఎక్కువ ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక ఈ నెలలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు రూ. 18,500 రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఎంత లేదన్నా కనీసం వారు ఒక 30 లక్షల వరకు ఉంటారు. దీనికి మరో ఆరేడు వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రం మీద ఈ అప్పుల భారం ఎప్పటికీ తీరేనో….