ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది కరోనా వైరస్. ఈ వైరస్ నుండి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వాలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సినిమా హాలు, స్కూల్స్, కాలేజీలు అన్నీ క్లోజ్ చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. కరోనా ఎవరికీ సోకకుండా ఎక్కడికక్కడ నిబంధనలు విధిస్తూ ప్రజలను అప్రమత్తం ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ ని కావాలని తమకు సోకే విధంగా… అమెరికాలో కొంతమంది విద్యార్థులు వ్యవహరిస్తున్నట్లు ఘటన ఇటీవల బయటపడింది. బలమైన రోగనిరోధక శక్తి కలిగిన యువకులు ఈ వ్యాధి ఎక్కించుకుని… బడాబాబుల బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారట.
పూర్తి విషయంలోకి వెళ్తే అమెరికాలోని ఇదహోంలో గల బ్రిఘం యంగ్ యూనివర్సిటీ విద్యార్థుల బాగోతం ఒకటి బయటకు వచ్చింది. యూనివర్సిటీ లో చక్కగా చదువుకోవలసిన విద్యార్థులు తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు ఈ విషయం బయటపడింది. ఈ మహమ్మారి కరోనా కు మందు లేకపోవడంతో చాలామంది ధనవంతులు ఈ వైరస్ బారినపడి, ప్లాస్మా డోనార్ కోసం ఎంత డబ్బు కట్టడానికి అయినా రెడీ అవుతున్నారు.
ఇప్పుడు ఈ ప్లాస్మా నే ఆధారం చేసుకుని ఈ యూనివర్సిటీ విద్యార్థులు కావాలని కరోనా అంటించుకుని.. తర్వాత దాని నుండి బయటపడి ప్లాస్మా డోనర్లుగా అవతారం ఎత్తి డబ్బులకు అమ్ముకుంటున్నారట. ఈ విధంగా భారీ రేట్లకు అమ్ముకొని వచ్చిన క్యాష్ తో విద్యార్థులు విచ్చలవిడి జీవితాన్ని అనుభవిస్తున్నారట. ఈ విషయం తాజాగా బయటపడటంతో యూనివర్సిటీ యాజమాన్యం… షాక్ కు గురై విచారణకు ఆదేశించినట్లు సమాచారం.