బిజెపి పార్టీ నాయకుడు సుజనా చౌదరి ఏపీలో బీజేపీ పార్టీ అడగటానికి అనేక పావులు కదుపుతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. చాలా వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర టీడీపీకి బదులు బిజెపి పోషించే రీతిలో రాజకీయం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ ని ఇరుకున పెట్టడానికి సుజనా చౌదరి వైసీపీలో కీలక లీడర్ ని టార్గెట్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయనని బిజెపి దారిలో తెచ్చుకుని వైసిపి పార్టీ కి వ్యతిరేకంగా అతని చేత రాజకీయం చేయించేలా స్కెచ్ వేస్తున్నట్లు టాక్. అంతే కాకుండా సదరు కీలక లీడర్… పార్టీ తీసుకున్న నిర్ణయాలకు, జగన్ వ్యవహరిస్తున్న తీరుకు, చాలా నొచ్చుకునట్లు… అండర్ గ్రౌండ్ లో సుజనా తో ఈ నేత ఆల్రెడీ టచ్లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అవుతున్నాయి.
పరిస్థితి ఇలా ఉండగా వైసీపీ లో ఉండే ఇంకా అసమ్మతి నేతలను ఎలాగైనా బిజెపి దారిలోకి తెచ్చుకునే రీతిలో సుజనాచౌదరి రామబాణం ప్రయోగం చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా వై.ఎస్.జగన్ చాలా దృఢంగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకునే రీతిలో పరిపాలన చేస్తున్నారు. అయితే ఈ తరుణంలో నేరుగా పాలన పరంగా కాకుండా అసమ్మతి తరహాలో రాజకీయం చేసి జగన్ ని ఇబ్బందులపాలు చేయాలని సుజనా చౌదరి ప్లాన్ గట్టిగా చేసినట్లు టాక్.
మరోపక్క జమిలి ఎన్నికలు 2022లో దేశ వ్యాప్తంగా జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో బిజెపి హైకమాండ్ కూడా సుజనాకి ఫుల్ పవర్స్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ప్రతీ రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా ఉండే వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో సుజనా చౌదరి ని పావుగా ఏపీ రాజకీయాల్లో వాడాలని డిసైడ్ అయిందట. దాదాపు టిడిపి పార్టీకి సంబంధించి క్యాడర్ సుజనా చౌదరికి బాగా టచ్ కావటంతో… అవసరమైతే టీడీపీలో బలమైన నాయకులను కూడా బిజెపిలోకి తెచ్చే రీతిలో ఏపీలో బీజేపీ చక్రం తిప్పనుంది అని సమాచారం.