సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాను అని ప్రకటించిన వార్త ఆయన అభిమానులను మాత్రమేగాక సన్నిహితులను ఎంతగానో కుంగదీస్తోంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా రజనీకాంత్ అభిమానులు ఆయన చేసిన ప్రకటన పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఎన్నికల సమయంలో అనేక అంచనాలు పెట్టుకున్న అభిమానులకు రజినీకాంత్ అనారోగ్యం అంటూ దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు అంటూ.. రాజకీయాల్లోకి రావడం లేదని మూడు పేజీల ప్రకటన లెటర్ అనేక మందిని షాక్ కు గురి చేసింది.
ఇదిలా ఉంటే తమిళనాడు రాజకీయాల్లో తాజాగా వినబడుతున్న వార్త దేశవ్యాప్తంగా సెన్సేషనల్ న్యూస్ గా మారింది. మేటర్ లోకి వెళ్తే రజినీకాంత్ రాజకీయాల నిర్ణయం నుండి వెనక్కి తగ్గడానికి కారణం ఆయన చేయించుకున్న సొంత సర్వే అని సరికొత్త టాక్ వస్తోంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా రజినీకాంత్ చేయించుకున్న ఈ సర్వేలో ఎన్నికలలో పోటీ చేస్తే కేవలం 20 సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వే ఫలితాల్లో తేలిందట.
దీంతో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి వెంటనే రజినీకాంత్ రాజకీయాల లోకి వెళ్లే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు టాక్. అంత మాత్రమే కాకుండా ప్రస్తుతం జనాలు చాలావరకూ చైతన్యం కలిగి ఉండటంతోపాటు.. రాజకీయాల్లోకి సినిమా ఫీల్డ్ నుండి వచ్చిన వాళ్ల విషయంలో పెద్దగా అవకాశాలు ఇచ్చే పరిస్థితి ఎక్కడా లేని క్రమంలో రజిని ఉన్న క్రేజ్ ని భద్రంగా ఉంచుకోవడమే బెటరని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమిళ మీడియా వర్గాలలో వార్తలు వస్తున్నాయి.