ఇటీవల జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే జరిగిన ఎన్నికలలో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటక పోవడంతో తెలంగాణ రాజకీయాల్లో సందిగ్దత నెలకొంది. అన్ని పార్టీల కంటే ముందంజలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నాగాని ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని అన్న దాని విషయంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది.
ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి డామేజ్ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారట. అదేవిధంగా ఎంఐఎం స్వయంగా వచ్చినా గానీ అదే జరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరోపక్క బిజెపి పార్టీ తో పొత్తు కి రెండు పార్టీలు ఎట్టి పరిస్థితిలో వెళ్లే అవకాశాలు ఏమాత్రం లేకపోవడంతో కార్డు టిఆర్ఎస్ పార్టీ ముందడుగు వేయలేని పరిస్థితి ఉండటంతో పాటు బిజెపి పార్టీకి మరో ఆప్షన్ లేకపోవడంతో ప్రతిపక్షంలో కూర్చోవడానికి రెడీ అవుతుంది.
ఇదిలా ఉంటే తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త టాక్ ఇప్పుడు వస్తుంది. అదేమిటంటే మేయర్ పీఠం విషయంలో ఎటు తేలే పరిస్థితులు లేకపోవడంతో కేసీఆర్ సర్కార్ మళ్లీ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈలోపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల లో వాటర్ అదే విధంగా రోడ్ల సమస్య పరిష్కారాన్ని పూర్తిచేసే ఆలోచన టిఆర్ఎస్ పార్టీ ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో రెండు నెలలుగా స్పెషల్ ఆఫీసర్ పాలన పెట్టి ఆ తర్వాత, ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు రాజకీయవర్గాలలో టాక్ నడుస్తోంది.