కరోనా పరిస్థితుల వల్ల పలు రాష్ట్రాలలో పరీక్షలు రాయకుండానే విద్యార్థులను పాస్ చేస్తున్నాయి పలు విద్యార్థి సంస్థలు. ఈ తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి విద్యార్థులను పాస్ చేయడంతోపాటు ఇంటర్నల్ మార్క్స్ లిస్టులను విద్యార్థులకు ఇవ్వటం జరిగింది. అదే రీతిలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించకుండానే సెకండ్ ఇయర్ విద్యార్థులను పాస్ చేసింది ప్రభుత్వం. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ పరీక్షల విషయంలో కూడా ఇంటర్నల్ గత సెమిస్టర్ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులను ప్రమోట్ చేయాలని భావించింది ప్రభుత్వం. రిపోర్టులను కూడా సీఎం కి పంపించింది.
ఈ విషయంలో ప్రభుత్వం కూడా రెడీ అవుతున్న తరుణంలో UGC అడ్డుపడింది. ఓ గైడ్ లైన్స్ కూడా జారీ చేసింది. ఫైనల్ ఇయర్ కి సంబంధించిన పరీక్షలు కచ్చితంగా నిర్వహించాలని పేర్కొంది. సెప్టెంబర్ చివరి లోపు పూర్తి చేయాలని పేర్కొంది. అయితే పరీక్షల నిర్వహణ విషయం వివాదంగా మారటంతో పలు విద్యా సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీంతో సుప్రీం కోర్టులో, డిగ్రీలు ప్రదానం చేసే ప్రక్రియలో నియమాలను రూపొందించే రైట్ కేవలం UGC కి మాత్రమే ఉందని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేవని, వాళ్ళకి హక్కులేదని పరీక్షలు రాస్తేనే డిగ్రీ పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొంది.
మరోపక్క మహారాష్ట్ర మరియు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించాలేమని అంటున్నాయి. మహారాష్ట్రలో వర్షాలు తీవ్రంగా కురుస్తున్న నేపథ్యంలో…. డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు ఇప్పుడప్పుడే నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో… ఢిల్లీ సర్కారు కూడా ప్రస్తుతం పరీక్షలు నిర్వహించ లేమని అంది. దీంతో ఈ కేసును సుప్రీంకోర్టు ఆగస్టు 14కు వాయిదా వేసింది. ఇదే టైం లో ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం పట్ల స్పందించేందుకు UGC కి సుప్రీంకోర్టు కొంత గడువు కూడా ఇవ్వడం జరిగింది.