Mask’s: ప్రపంచంలోకి కరోనా వైరస్ వచ్చిన తరువాత మనిషి జీవితంలో మాస్క్ తప్పనిసరి అయిపోయింది. ప్రపంచంలో ఏ దేశంలో కి వెళ్ళిన మాస్క్ పెట్టుకోవాల్సిందే. దీని వల్ల ఒకరి నుండి మరొకరికి సోకే అవకాశం తక్కువ ఉండటంతో ప్రపంచంలో అన్ని దేశాలు మాస్క్ తప్పనిసరి అని నిబంధనలు విధించడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి ప్రభావం చాలా వరకు తగ్గింది. ఇక మన దేశంలో అయితే ప్రారంభం లో కరోనా మహమ్మారి ని గట్టిగా డిఫరెంట్ చేసుకోగా సెకండ్ వేవ్ తీవ్రత మాత్రం దేశం పై అధికంగా చూపటం జరిగింది. దేశ వ్యాప్తంగా అత్యధిక మరణాలు కరోనా సెకండ్ వేవ్ లోనే చోటుచేసుకున్నాయి. ఆక్సిజన్ కొరత తో పాటు వైద్య సదుపాయం సకాలంలో.. అందక చాలా మంది బలిగొన్నరు.
పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు దేశంలో కరోనా తీవ్రత తగ్గిన కానీ… ప్రభుత్వాలు మాస్కు తప్పని సరి చేయటం మాత్రమే కాక మాస్కు ధరించకపోతే భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఇటువంటి తరుణంలో శ్వాసకోస సంబంధిత వ్యాధులు కలిగిన వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటంతోపాటు.. ఎప్పుడు ఈ మాస్క్ గోల పోతుందో అనే డిస్కషన్లు బయట చేసుకుంటున్నారు. మాస్క్ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి తరుణంలో నీతి అయోగ్ సభ్యులు వికె పాల్.. మాస్క్ ఎప్పటి వరకు ధరించాలి అన్నదానిపై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్ స్టార్ట్ కావటంతో…థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది అని… 2022 వరకు మాస్కులు తప్పనిసరి అని స్పష్టం చేశారు. మరో పక్క కేంద్రం దేశంలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం చాలా వేగంగా చేస్తూ ఉంది. మారుమూల ప్రాంతాలలో డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం డిసెంబర్ మాసం కల్లా దేశంలో 50% వ్యాక్సినేషన్ జరుగుతుందని వచ్చే ఏడాది ప్రారంభంలో దేశవ్యాప్తంగా మొత్తం.. అందరికీ వ్యాక్సిన్ అందించే అవకాశం ఉందని.. వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో వచ్చే ఏడాదిలో.. మాస్క్ పెట్టుకునే అవసరం దాదాపు ఉండదని భావిస్తున్నారు.