KCR : తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ రోజే 2021-2022 తెలంగాణ బడ్జెట్ నీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అధిక శాతం వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించే తరహాలో కేసీఆర్ సర్కార్ తాజా బడ్జెట్లో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇలాంటి తరుణంలో మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు వచ్చిన ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీలకు కేసీఆర్ సర్కార్ అదిరిపోయే గిఫ్ట్ లు అందించింది.
మేటర్ లోకి వెళ్తే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు యాపిల్ కంపెనీకి సంబంధించిన ఐప్యాడ్ బహుమతులుగా ఇచ్చింది. చాలా వరకు రాజకీయాలు ప్రస్తుతం సోషల్ మీడియా ఆధారంగా ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో .. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కీలక కార్యక్రమాలు ప్రజలకు అందే రీతిలో కేసీఆర్ సర్కార్ .. ప్రజాప్రతినిధులకు ఐప్యాడ్ ఇచ్చినట్లు తెలంగాణ రాజకీయాల్లో టాక్. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలకు కెసిఆర్ తమకిచ్చిన గిఫ్ట్ లు తాజాగా అసెంబ్లీ ప్రాంగణంలో వీడియోలో చూపిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు.