అసలు దళితులు గా ఎవరు పుట్టాలని అనుకుంటారు అంటూ అప్పట్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మారాయి. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు చాలామంది సామాజిక వేత్తలు మరియు దళిత నాయకులు తీవ్ర స్థాయిలో మండి పడటం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్న వైయస్ జగన్ కూడా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుని ఆయన చేసిన వ్యాఖ్యలు బట్టి నిలదీశారు. ఆ విషయం పక్కన పెడితే కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు చెప్పుకొస్తారు. ముఖ్యంగా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా కృష్ణాజిల్లాలో ఉంటారని అందువల్లే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కృష్ణాజిల్లా కి దగ్గరగా అమరావతి రాజధాని పెట్టారు అంటూ చెప్పుకొస్తారు.
అటువంటి కృష్ణా జిల్లాలో ప్రధాన నగరం విజయవాడ నడిబొడ్డులో 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహం జగన్ ఏర్పాటు చేయడానికి రెడీ అవటం వెనకాల రాజకీయ ఎత్తుగడ ఉందని వార్తలు వస్తున్నాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు అవ్వాల్సిన అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు సడన్ గా కనీసం మీడియాకి కూడా తెలియకుండా సైలెంట్ గా చడీచప్పుడు లేకుండా జగన్ విజయవాడ నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి కారణం చంద్రబాబుని పూర్తిగా దళిత వ్యతిరేక నాయకుడిగా చూపించడానికే అని వార్తలు వస్తున్నాయి.
విషయంలోకి వెళ్తే జగన్ సర్కార్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్న స్వరాజ్ మైదానం కోర్టు వివాదాల్లో ఉందని…అది ఓ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడిది అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఆపితే కచ్చితంగా దళితుల్లో టీడీపీ పూర్తిగా దళిత వ్యతిరేక పార్టీ ముద్ర ఏర్పడుతుందని జగన్ ఈ ఎత్తుగడ వేసినట్లు కొంతమంది అంటున్నారు. ఎలాగో గతంలోనే చంద్రబాబు దళితుల లాగా ఎవరు జన్మించాలి అనుకుంటారు అని కామెంట్ చేయటం జరిగింది. ఈ తరుణంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు అడ్డుకుంటే ఇక పూర్తిగా దళితులకు టీడీపీపై పూర్తి వ్యతిరేకత ఏర్పడుతుందని జగన్ సైలెంట్ గా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చాలామంది ఉంటున్నారు.