ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి గా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నట్లు ఇటీవల కొన్ని సర్వేలలో తేలింది. ముఖ్యంగా కరోనా కట్టడి విషయంలో అదే విధంగా ఇలాంటి కరోనా సంక్షోభ సమయంలో కూడా సంక్షేమ పథకాలు అందించడంలో జగన్ నిజాయితీ గా వ్యవహరించారు… అంటూ ఏపీ ప్రజలు నమ్ముతున్నారని కొన్ని సర్వేలు చెప్పుకొస్తున్నాయి. మరోపక్క ప్రత్యర్థి పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి అవినీతిని వెలికి తీస్తూ తెలుగుదేశం పార్టీ నేతలకు జగన్ నిద్ర లేకుండా చేస్తున్నారు.
ఎప్పుడూ ఎవరూ అరెస్ట్ అవుతారు అన్న రీతిలో.., ఏ కేసు బయట పడుతుందో..ఏ కుంభకోణం పేరిట నోటీసులు వస్తాయో అన్న రీతిలో చంద్రబాబు హయాంలో పనిచేసిన మంత్రులు ప్రస్తుతం తెగ ఆందోళన లో ఉన్నారంట. ఇదిలా ఉండగా త్వరలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాలుగు భారీ వికెట్లు డౌన్ అవుతున్నట్లు…వైసీపీ పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు భారీ ఎత్తున కిందిస్థాయి…కార్యకర్తలతో కలసి త్వరలోనే జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. టీడీపీ పార్టీకి చెందిన పెద్ద నాయకులు వరుసగా అరెస్టులు అవ్వటంతో…పాటు చంద్రబాబు కి వయసు మీద పడటంతో పార్టీలోనే ఉంటే ఇంకా భవిష్యత్తు ఉండదని ఆ నేతలు వైసీపీ లోకి రావటానికి రెడీ అవుతున్నట్లు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.