వైయస్ జగన్ ఎంత మంచి కార్యక్రమాలు చేపడుతున్న కానీ పార్టీలో కొంతమంది నాయకులు మద్దతుదారులు చేస్తున్న అత్యుత్సాహం వల్ల వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి అని పరిశీలకులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న టీడీపీ నాయకులు ఇసుక విషయంలో భయంకరంగా అవినీతికి పాల్పడ్డారని ప్రతిపక్షంలో ఉన్న టైంలో జగన్ తెగ ఊదరగొట్టడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చాక ఎక్కడా కూడా అవినీతి లేకుండా చేస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే జగన్ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది.
ఆ విధంగానే గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఇసుక, మద్యం విషయంలో చాలా జాగ్రత్తగా జగన్ డీల్ చేసుకుంటూ వస్తున్నారు. అయినా కానీ ఇటీవల వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు ఇసుకను యదేచ్ఛగా తవ్వుకుంటూ కోట్లు సంపాదిస్తున్నారని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోడ్ ఎక్కడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. సొంత పార్టీ నాయకుడు ఆరోపణలు చేయడంతో వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు వినబడుతున్నాయి.
ప్రతిపక్షాలు కూడా ఇసుక విషయంలో జగన్ పార్టీని ఇరుకున పెట్టే విధంగా ఆరోపణలు స్టార్ట్ చేయటంతో ఈ విషయం జగన్ కి తలనొప్పిగా మారింది. వెంటనే జగన్ ఇసుక విషయంలో ఎవరి మీదనైతే ఆరోపణలు వస్తున్నాయో సదరు పార్టీ ప్రతినిధులకు ‘ హద్దుల్లో ఉండండి ‘ అంటూ ఇటీవల కూర్చోబెట్టి మరీ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇసుక విషయంలో అంతా అధికారులు చూసుకుంటారని, ఈ విషయంలో పార్టీ నాయకులు ఎవరైనా కలుగ చేసుకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని జగన్ హెచ్చరించినట్లు వైసీపీ పార్టీలో టాక్.