దిగ్గజ వాహన తయారీ సంస్థ యమహా. ఇప్పుడు తన కొత్త స్పెషల్ ‘వింటేజ్ ఎడిషన్’ ఎఫ్జెడ్ఎస్-ఎఫ్ఐ మోటార్సైకిల్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. బ్లూటూత్ కనెక్టివిటీ సిస్టమ్ తో అలరించనుంది.. ఫీచర్స్, ప్రత్యేకతలు ఇలా..
సేఫ్టీ ఫీచర్లు:
‘యమహా కనెక్ట్ ఎక్స్’ అనేది బ్లూటూత్ ఆధారిత సేఫ్టీ ఫీచర్, ఇది మొబైల్ యాప్ ద్వారా నియంత్రించవచ్చు. భవిష్యత్తులో ఈ కనెక్టివిటీ ఫీచర్ను అన్ని యమహా వాహనాల్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. బ్లూటూత్ ఫీచర్తో మొబైల్ అప్లికేషన్ ద్వారా చాలా ఫీచర్లను పొందవచ్చు.ఈ బైక్లో బ్లూటూత్ ఫీచర్ను ఉపయోగించడానికి కంపెనీ ‘యమహా మోటార్సైకిల్ కనెక్ట్ ఎక్స్ అప్లికేషన్’ ను కూడా విడుదల చేసింది. యమహా వింటేజ్ ఎడిషన్ క్లాసిక్ స్టైల్ లో ప్రవేశపెట్టారు. ఈ బైక్లో వింటేజ్ గ్రాఫిక్స్, లెదర్ ఫినిష్ స్ప్లిట్ సీట్లు ఉన్నాయి.
యమహా కనెక్ట్ ఎక్స్ ఫీచర్ బైక్ను 6 విధాలుగా రక్షణ కల్పిస్తుంది. ఇందులో బైక్ను దొంగతనం నుండి రక్షించడం, రిమోట్ లాక్-అన్లాకింగ్, రైడింగ్ హిస్టరీ చూడటం వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. బైక్లోని ఇ-లాక్ ఫీచర్ బైక్ను దొంగతనం నుండి రక్షిస్తుంది. ఎవరైనా బైక్ యొక్క కీ ఓపెన్ చేయాలనీ లేదా దానిని విచ్చిన్నం చేయాలనీ చూస్తే బైక్ హారన్ ఆటోమాటిక్ గా మోగడం గమనించవచ్చు. అంతే కాకుండా ఈ నోటిఫికేషన్ స్మార్ట్ఫోన్కి అందించి తెలియజేస్తుంది.
దీనితో పాటు, బైక్లో ఆన్సర్ ఫీచర్ ఇవ్వబడింది, దానితో బైక్ ఇండికేటర్ ఆన్లో ఉన్నప్పుడు దాని స్థానాన్ని తెలియజేస్తుంది. కనెక్ట్ X లో, ‘లొకేట్ మై బైక్’ యొక్క ఫీచర్ కూడా అందించారు.ఇది ఉపయోగించినప్పుడు, పార్కింగ్ స్థలంలో బైక్ ఉన్నప్పుడు బైక్ యొక్క స్థానం తెలుపుతుంది.
స్పెషల్
ఫీచర్స్:
ఇవి కాకుండా, బైక్లో హజార్డ్ లైట్ ఫీచర్ కూడా ఉంది, స్మార్ట్ఫోన్ అప్లికేషన్ ద్వారా కూడా దీన్ని ఆన్ / ఆఫ్ చేయవచ్చు. హజార్డ్ ఫంక్షన్ ఆన్లో ఉన్నప్పుడు బైక్ యొక్క ఫోర్ ఇండికేటర్స్ ఒకేసారి మెరిసిపోతాయి. ఇది కాకుండా, బైక్ రైడింగ్ మరియు పార్కింగ్ హిస్టరీని తెలుసుకునే సౌకర్యం కూడా ఉంది. ప్రతి ట్రిప్ తరువాత, బైక్ దాని సగటు వేగం, మైలేజ్ వంటి సమాచారాన్ని అందిస్తుంది.
వింటేజ్ ఎడిషన్ను ప్రారంభించడంతో, భారతీయ వినియోగదారుల కోసం కంపెనీ తన బైక్ను నిరంతరం మెరుగుపరుస్తోందని యమహా పేర్కొంది. కంపెనీ కాలక్రమేణా తన బైక్కు కొత్త ఫీచర్లను జోడించడం కొనసాగిస్తుంది. యమహా ఎఫ్జెడ్ఎస్-ఎఫ్ఐ వింటేజ్ ఎడిషన్ ఖచ్చితంగా యువ కస్టమర్లను ఆకర్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది ప్రత్యేకమైన స్టైలింగ్ నవీకరణలతో పాటు స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ ఫీచర్తో వస్తుంది. భారత మార్కెట్లో బజాజ్ పల్సర్ 150, టివిఎస్ అపాచీ ఆర్టిఆర్ 160 మరియు సుజుకి జిక్సెర్ 155 వంటి వాటికి యమహా ఎఫ్జెడ్ఎస్-ఎఫ్ఐ ప్రత్యర్థిగా ఉంటుంది.
ఎఫ్జెడ్ఎస్-ఎఫ్ఐ ఎబిఎస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,09,700. కొత్త ఎడిషన్ బైక్ను డిసెంబర్ మొదటి వారం నుంచి అన్ని అధికారిక డీలర్షిప్లలో అందుబాటులో ఉంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది.