Breaking: కేంద్ర పర్యావరణ శాఖ తీరుపై జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణంపై ఎన్జీటీ నేడు విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చిన కౌంటర్ దాఖలు చేయకపోవడంతో పదివేల రూపాయల జరిమానా విధించింది. మార్చి 15 లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయకపోతే సంబంధిత అధికారుల నుండి జరిమానా వసూలు చేయాలంటూ ఎన్జీటీ ఆదేశించింది. తెలంగాణ సచివాలయం భవనం పర్యావరణ అనుమతులు తీసుకోకుండా నిర్మిస్తున్నారంటూ దాఖలపైన పిటిషన్ పై ఎన్జీటీ విచారణ జరిపింది.