KCR: తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఆ రాష్ట్ర ఖజానాకు కాసులు కురిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్ణయం తప్పనిసరి అయినప్పటికీ దానివ్లల ఫలితాలు మాత్రం ఊహించని విధంగా ఉన్నాయంటున్నారు. ఇదంతా కరోనా సమయంలో అమలు చేస్తున్న నిబంధనల గురించి. కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ సాగుతోన్న సమయంలో తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో ఓ ఆశ్చర్యకర విషయం బయటపడింది.
హైకోర్టులో ఆసక్తికర ఎపిసోడ్
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు హాజరుకాగా ప్రస్తుతం అమలవుతోన్న లాక్డౌన్, కరోనా నిబంధనలపై డీజీపీ మహేందర్ రెడ్డి.. హైకోర్టుకు నివేదిక అందజేశారు. కరోనా నేపథ్యంలో కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లాక్డౌన్ ను పకడ్బందిగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 1 నుంచి 14వ తేదీ వరకు నిబంధనల ఉల్లంఘనల కింద మొత్తం 4,31,823 కేసులు నమోదు చేశామని మాస్కులు ధరించనివారిపై 3,39,412 కేసులు నమోదు చేశామని.. వారిపై మొత్తం రూ.31 కోట్ల జరిమానా విధించామని వివరించారు.
భారీగా కేసులు
భౌతిక దూరం పాటించనందుకు 22,560 కేసులు నమోదు చేశామని, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనపై 26,082 కేసులు పెట్టామని వివరించారు. బ్లాక్ మార్కెట్లో ఔషధల అమ్మకాన్ని నిరోధిస్తున్నామని తెలిపిన డీజీపీ.. ఇప్పటికి 98 కేసులు నమోదు చేశామని వివరించారు. లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై తెలంగాణ హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. వ్యాక్సినేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.