Breaking: హైదరాబాద్ నుండి కార్యకలాపాలు సాగిస్తున్న ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ లైసెన్స్ ను ప్రసార మంత్రిత్వ శాఖ తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు తెలుస్తొంది. సంహిత బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేటు లిమిటెడ్ కు ఉచితంగా స్లాట్ ఇవ్వడంతో నిబందనలు తుంగలో తొక్కిందని, అనధికార న్యూస్ ప్రసారాలు చేస్తొందన్న అభియోగాలతో ఈ చర్యలు తీసుకున్నట్లుగా న్యూస్ ఎరినా ఇండియా పేర్కొంది. నిజానికి ప్రైమ్ 9 న్యూస్ పేరుకు మాత్రమే రాయుడు విజన్ మీడియా లిమిటెడ్ లో పరిమితం అయినప్పటికీ సంహిత బ్రాడ్ కాస్టింగ్ నియంత్రలోనే ఉంది. తెలంగాణ ప్రభుత్వంలోని ఓ కీలక వ్యక్తి చేతిలో మీడియా సంస్థ ఉన్నట్లు సమాచారం. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ షోకాజ్ కు ప్రైమ్ 9 న్యూస్ యజమాన్యం సమాధానాలు చెప్పాల్సి ఉంది.
హైదరాబాద్ లో ఎక్కువ వ్యూవర్ షిప్ ఉన్న న్యూస్ ఛానల్ గా గుర్తింపు ఉన్న ప్రైమ్ 9 న్యూస్ ను 2018 లో ప్రారంభించారు. సత్తెనపల్లి నియోజకవర్గం నుండి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేసిన రిటైర్డ్ బ్యూరోక్రాట్ బైరా దిలీప్ చక్రవర్తికి సన్నిహితుడైన ఓ ఎన్ఆర్ఐ దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన కు మద్దతుగా ఉంది. బైరా దిలీప్ రాబోయే ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారని సమాచారం. ఈ తరుణంలో ఆయన ఛానల్ పై వేటు పడింది.
BIG BREAKING NEWS
Prime 9 News License Suspended
In a major crackdown on illegal news media , The Ministry of Information and Broadcasting has suspended the license of Hyderabad-based news channel Prime 9 News.
The suspension of Prime 9 News is a major blow to the channel,…
— News Arena India (@NewsArenaIndia) July 8, 2023