YSR Jayanti: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 74వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తొంది. ఇడుపులపాయలో వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో వైఎస్ విజయమ్మ, షర్మిల పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు పాల్గొన్నారు. పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో నేతలు, ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, నేతలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, పేద సంక్షేమం కోసం వైఎస్ఆర్ చేసిన కృషిని నేతలు గుర్తు చేసుకున్నారు. కాగా మధ్యాహ్నం సీఎం జగన్ అనంతపురం పర్యటన అనంతరం ఇడుపులపాయకు చేరుకుని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు.