PM Modi: తెలంగాణలో కేసిఆర్ సర్కార్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. కేసిఆర్ సర్కార్ అవినీతిని పెంచి పోషిస్తొందని విమర్శించారు. వరంగల్లు సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ..దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కేసిఆర్ద్ దేనని అన్నారు. తొమ్మిదేళ్లలో కేసిఆర్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు. యువత, ప్రజలను కేసిఆర్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. అవినీతి లేకుండా తెలంగాణలో ఏ పని జరగడం లేదని అన్నారు. కేసిఆర్ ప్రభుత్వ అవినీతి ఢిల్లీ వరకూ పాకిందంటూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను ఉద్దేశించి ఎమ్మెల్సీ కవితపై పరోక్ష విమర్శలు చేశారు. ఎక్కడైనా అభివృద్ధి కోసం రాష్ట్రాలు కలిసి పని చేస్తాయని కానీ అవినీతి కోసం తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాలు కలిసి పని చేస్తున్నాయనీ, దీని కోసమేనా యువత బలిదానాలు చేసిందని మోడీ ప్రశ్నించారు.
కేసిఆర్ సర్కార్అంటే అదో కుటుంబప పాలన వ్యవస్థ అని మోడీ ఎద్దేవా చేశారు. కేసిఆర్ కుటుంబ అవినీతిపై కేంద్ర సంస్థలు గురి పెట్టాయనీ, స్కామ్ ల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసిఆర్ కొత్త నాటకాలకు తెరలేపారని ఆరోపించారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అంటూ కాంగ్రెస్ విమర్శిస్తున్న నేపథ్యంలో దీనిపైనా మోడీ క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ – బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కాదని మోడీ స్పష్టం చేశారు. కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ ట్రైలర్ చూపించామనీ, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ను అడ్రస్ లేకుండా చేస్తామని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు.
దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక ప్తాత్ర అని కొనియాడిన మోడీ..ఆర్ధిక వృద్ధిలోనూ తెలంగాణ ముందుందన్నారు. దేశాభివృద్ధిలో తెలుగు వారి ప్రతిభ కీలకంగా మారిందని అన్నారు. తెలంగాణలో ఆరు వేల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేలు నిర్మిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఆర్ధిక హబ్ గా మారుతోందని మోడీ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు వస్తున్నాయని అన్నారు. తొలుత వరంగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని ప్రధాని మోడీ సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో కొద్ది సేపు మోడీ ధ్యానం చేశారు.