ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు సింగిల్ బెంచ్ లో మంగళవారం విచారణ జరిగింది. గతంలో ఇచ్చిన ఆర్డర్ సస్పెన్,న్ ను మూడు వారాలకు పొడిగించాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు వీలుగా తీర్పును ఆపాలని కోరింది. ఈ సందర్భంలో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదైందా అని కోర్టు ప్రశ్నించగా, ఇంకా నమోదు కాలేదని డిప్యూటి సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు బదిలీకి మూడు సార్లు లేఖ రాసినా ప్రభుత్వం స్పందించలేదని డిప్యూటి సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. కేసు ఫైళ్లు అప్పగించాలంటూ సీబీఐ ఒత్తిడి చేస్తొందని ఏజీ కోర్టుకు దృష్టికి తీసుకువచ్చారు. సుప్రీం కోర్టులో అప్పీల్ కు వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందని హైకోర్టు ప్రశ్నించింది. అప్పీల్ కు వెళ్లేందుకు వారం రోజుల సమయం పడుతుందని కోర్టుకు ఏజీ సమాధానం ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన కోర్టు సీజే బెంచ్ నుండి అనుమతి తీసుకుని రావాలని ఏజీకి సూచించింది. రేపు చీఫ్ జస్టిస్ కోర్టులో మెన్షన్ చేస్తానని ఏజీ తెలుపగా, తదుపరి విచారణను సింగిల్ బెంచ్ వాయిదా వేసింది.
కాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సీబీఐకి అప్పగించాలని హైకోర్టు సింగ్ బెంచ్ గతంలో ఇచ్చిన తీర్పుపై తెలంగాణ సర్కార్ నేడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. నిన్న డివిజన్ బెంచ్ తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్ వేసింది. ఈ కేసులో నిన్న కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు సీజే ధర్మాసనంలో తెలంగాణ సర్కార్ కు చుక్కెదురైంది. కేసు సీబీఐకి అప్పగించాలన్న సింగిల్ బెంచ్ తీర్పునే డివిజన్ బెంచ్ సమర్దించింది. సీబీఐ దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు ఏజీ సమయం కోరగా, అందుకు నిరాకరించింది. సింగిల్ బెంచ్ తీర్పును అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి, దర్యాప్తు సంస్థ సీబీఐకి ఆదేశించింది డివిజన్ బెంచ్.
బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని మోడీ భావోద్వేగానికి గురై..