YS Sharmila: తెలంగాణలో త్వరలో రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల కేసిఆర్ సర్కార్ పై తొలి సమరశంఖం పూరిస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యపై పోరాటానికి సన్నద్దం అవుతున్నారు. ఉద్యోగ ఖాళీల నియామకానికి ప్రభుత్వం నోటిపికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15వ తేదీ (రేపు) నుండి మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేయనున్నట్లు షర్మిల ప్రకటించారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన సభలో షర్మిల ఈ విషయాన్ని వెల్లడించారు.
కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ శాంతియుతంగా ఇందిరా పార్క్ వద్ద మూడు రోజుల పాటు నిరాహర దీక్ష చేయనున్నామనీ, దీనికి అనుమతి ఇవ్వాలని కోరుతూ షర్మిల పార్టీ నేతలు సెంట్రల్ జోన్ పోలీసులను ఆశ్రయించారు. అయితే అయితే షర్మిల నిరాహార దీక్ష కు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే కేవలం ఒక్క రోజు నిరాహార దీక్షకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకూ నిరాహార దీక్షకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు సమాచారం. దీనిపై మరో సారి షర్మిల పార్టీ నేతలు మరో సారి పోలీసులకు విజ్ఞప్తి చేయాలని భావిస్తున్నారుట. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా పోలీసులు ఒక్క రోజుకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారని అంటున్నారు.